భారత్ పై మిలిటరీ దాడులు చేస్తాం: పాకిస్థాన్ సంచలన వార్నింగ్
పాకిస్థాన్.. భారత్ పై మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధం జరుగుతున్న తరుణంలో భారత్- పాకిస్థాన్ మధ్య మరోసారి తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్.. భారత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లోని పలు కీలక నగరాలపై మిలీటరీ దాడులు చేయాలని ఆదేశించారు. పశ్చిమాసియా నుంచి పాకిస్థాన్ పై దాడులకు పాల్పడితే ప్రతీకార చర్యగా తాము భారత్ పై దాడులు చేస్తామని హెచ్చరించారు. తాజాగా జరిగిన లైవ్ బ్రాడ్ కాస్ట్ లో ఈ వ్యాఖ్యలు చేశారు. అబ్దుల్ బాసిత్ 2014 నుంచి 2017 వరకు పాకిస్థాన్ హైకమిషనర్ గా బాధ్యతలు నిర్వర్తించారు.
ప్రస్తుతం పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే యుద్ధంలో భాగంగా ఒకవేళ అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా పాకిస్థాన్ పై దాడులకు పాల్పడితే పాకిస్థాన్ చూస్తూ ఊరుకోదని.. వెంటనే భారత్ పై ప్రతీకార దాడులు చేస్తుందని అబ్దుల్ బాసిత్ స్పష్టం చేశారు. అమెరికా తమ రేంజ్ లో లేదు కాబట్టి డిఫాల్ట్ గా భారత్ లోని దిల్లీ, ముంబై లాంటి పెద్ద పెద్ద నగరాలపై అణుబాంబులు వేస్తామని ఆయన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. మరోవైపు పాకిస్థాన్ నుంచి తమకు న్యూ క్లియర్ థ్రెట్ ఉందని అమెరికా ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ ఇటీవల తెలిపిన నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
#BreakingNews | "India may face 26/11-style attacks."
— News18 (@CNNnews18) March 21, 2026
Former Pak High Commissioner Abdul Basit warns of a catastrophic security blowback for India if the US and Israel ever plan to strike Pakistan and its nuclear facility#ExclusiveStory: @manojkumargupta @AmanKayamHai_ and… pic.twitter.com/rQIZOxPoDD
ఇక జమ్మూ కాశ్మీర్ అనంత్ నాగ్ జిల్లాలోని పహల్గామ్ లోయలో గతేడాది ఏప్రిల్ 22 న ఉగ్రవాదులు జరిపిన మారణహోమంలో 26 మంది అమాయక టూరిస్టులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే ఈ దాడికి పాల్పడింది పాకిస్థాన్ అని తేలిన నేపథ్యంలో మే 7-10 మధ్య పాకిస్థాన్ లోని 9 కీలక స్థావరాలపై భారత్ దాడులకు పాల్పడింది. వాటిని ధ్వంసం చేసింది. వందలాది మంది టెర్రరిస్టులను హతమార్చింది.

భారత్ ధ్వంసం చేసిన పాకిస్థాన్ స్థావరాల్లో ముజఫరాబాద్ లోని సవాయ్ నాలా క్యాంప్, ముజఫరాబాద్ లోని సిడ్నా బిలాల్ క్యాంప్, కోట్లీలోని గుల్ పూర్ క్యాంప్, భీంబర్ లోని బర్నాలా క్యాంప్, కోట్లీలోని అబ్బాస్ క్యాంప్, సియాల్ కోట్ లోని సర్జాల్ క్యాంప్, సియాల్ కోట్ లోని మెహమూనా జోయా క్యాంప్, మురిడ్ కే లోని మార్కాజ్ టైబా క్యాంప్, బహావల్ పుర్ లోని మార్కజ్ సుభానల్లా క్యాంప్ ఉన్నాయి.
-
ఉరుములు, పిడుగులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరికలు జారీ.. -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పాకిస్తాన్ ‘డెడ్ లైన్’.. వణుకుతున్న ఐఎస్ఐ అగ్రనేతలు! -
దురంధర్-2కు బిగ్ షాక్.. ఆన్లైన్లో ప్రత్యక్షమైన ప్రింట్! -
మహారాష్ట్రలోని అండర్ వరల్డ్ డాన్ "దావూద్ ఇబ్రహీం" ఆస్తులు వేలం..! -
కొబ్బరి నీళ్లు.. చెరకు రసం - వేసవిలో ఈ రెండింటిలో ఏది మంచిది..!? -
INSPIRING STORY : నాడు రోజుకు రూ.5 రైతు కూలీ.. నేడు ఆక్స్ఫర్డ్లో "ఏఐ" పై ప్రసంగం..! -
ప్రపంచంలో సంతోషకరమైన దేశం ఇదే.. మారిన లెక్కలు.. -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!!











Click it and Unblock the Notifications