భారత్ - పాకిస్తాన్ సరిహద్దుల్లో కాల్పులు
శ్రీనగర్: సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. భారత్ బలగాలు ధీటైన సమాధానం ఇచ్చాయి. జమ్ము, కత్వా జిల్లాల్లో పాకిస్తాన్ గత రాత్రి నుంచి కాల్పులు జరుపుతోంది. ధీటుగా స్పందించిన ఇండియన్ ఆర్మీ ఎదురు కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 15 మంది పాక్ రేంజర్లు హతమయ్యారని తెలుస్తోంది.
భారత్ - పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత నేపథ్యంలో సరిహద్దులోని గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సరిహద్దులోని దాదాపు 400 కుటుంబాలు అక్కడి నుంచి తరలి వెళ్లాయి. గురువారం రాత్రి నుంచి పాకిస్తాన్ దళాలు జమ్ములోని దాదాపు 24 మన సైన్యం పోస్ట్లను టార్గెట్ చేశాయి.
నౌషెరా, సుందర్భనీ, పల్లన్వాలా, హీరా నగర్, కాత్వా తదితర సెక్టారులలో పాక్ దళాలు కాల్పులు జరిపాయి. ఉధయం ఐదు గంటల వరకు కూడా ఉద్రిక్తత కొనసాగిందని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ (బీఎస్ఎఫ్) జమ్ము ఫ్రంటియర్ డిఐజీ ధర్మేంద్ర పరేక్ తెలిపారు.
సరిహద్దుల్లో పాకిస్తాన్ మరోసారి రెచ్చిపోయింది. భారత్ బలగాలు ధీటైన సమాధానం ఇచ్చాయి. జమ్ము, కత్వా జిల్లాల్లో పాకిస్తాన్ గత రాత్రి నుంచి కాల్పులు జరుపుతోంది. ధీటుగా స్పందించిన ఇండియన్ ఆర్మీ ఎదురు కాల్పులు జరిపింది. ఈ ఘటనలో 15 మంది పాక్ రేంజర్లు హతమయ్యారని తెలుస్తోంది.