ఎవరెస్ట్: 70మంది పర్వతారోహకుల ప్రాణాలను కాపాడిన భారత వైద్యుడు
న్యూఢిల్లీ: నేపాల్లో శనివారం సంభవించిన భారీ భూకంపం కారణంగా ఎవరెస్ట్ వద్ద మంచు తుఫాను తలెత్తిన సమయంలో అక్కడున్న పర్వతారోహకుల ప్రాణాలను కాపాడిన భారత సైన్యానికి చెందిన వైద్యుడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రాణాలు కాపాడిన ఆయన తమ పాలిట ప్రత్యక్ష దైవంగా కనిపించాడని బాధిత పర్వతారోహకులు చెబుతున్నారు.
సుమారు 70మంది పర్వతారోహకుల బృందం భూకంప సమయంలో ఎవరెస్ట్ బేస్ క్యాంపు వద్ద ఉన్నారు. ఆ సమయంలోనే భారత సైన్యానికి చెందిన కెప్టెన్ రితేశ్ గోయల్(28).. 30మంది సభ్యుల బృందంతో కలిసి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్లారు.

ఆకస్మాత్తుగా విరుచుకుపడిన మంచుతుఫానులో బృందమంతా చెల్లాచెదురైపోయి, అనేకమంది కాళ్లూ, చేతులూ విరిగిపోయాయి. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
కాగా, గోయెల్ స్థిర సంకల్పంతో వారందరికీ ప్రాథమిక చికిత్స అందించి వారి ప్రాణాలను నిలబెట్టాడు. హెలికాప్టర్లు వచ్చి వారిని రక్షించడానికి 14గంటలు పడితే, అంతవరకు ఆయన అందరికీ చికిత్స అందించారు. కాగా, గోయల్ గతంలో సియాచిన్ వంటి పర్వత ప్రాంతాల్లోనూ సేవలందించారు.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications