ఎవరెస్ట్: 70మంది పర్వతారోహకుల ప్రాణాలను కాపాడిన భారత వైద్యుడు
న్యూఢిల్లీ: నేపాల్లో శనివారం సంభవించిన భారీ భూకంపం కారణంగా ఎవరెస్ట్ వద్ద మంచు తుఫాను తలెత్తిన సమయంలో అక్కడున్న పర్వతారోహకుల ప్రాణాలను కాపాడిన భారత సైన్యానికి చెందిన వైద్యుడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ప్రాణాలు కాపాడిన ఆయన తమ పాలిట ప్రత్యక్ష దైవంగా కనిపించాడని బాధిత పర్వతారోహకులు చెబుతున్నారు.
సుమారు 70మంది పర్వతారోహకుల బృందం భూకంప సమయంలో ఎవరెస్ట్ బేస్ క్యాంపు వద్ద ఉన్నారు. ఆ సమయంలోనే భారత సైన్యానికి చెందిన కెప్టెన్ రితేశ్ గోయల్(28).. 30మంది సభ్యుల బృందంతో కలిసి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించడానికి వెళ్లారు.

ఆకస్మాత్తుగా విరుచుకుపడిన మంచుతుఫానులో బృందమంతా చెల్లాచెదురైపోయి, అనేకమంది కాళ్లూ, చేతులూ విరిగిపోయాయి. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి.
కాగా, గోయెల్ స్థిర సంకల్పంతో వారందరికీ ప్రాథమిక చికిత్స అందించి వారి ప్రాణాలను నిలబెట్టాడు. హెలికాప్టర్లు వచ్చి వారిని రక్షించడానికి 14గంటలు పడితే, అంతవరకు ఆయన అందరికీ చికిత్స అందించారు. కాగా, గోయల్ గతంలో సియాచిన్ వంటి పర్వత ప్రాంతాల్లోనూ సేవలందించారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే? -
Gold రూ.లక్షకే సవరి.. వచ్చే 10 రోజుల్లో ఏం జరగబోతుంది












Click it and Unblock the Notifications