దుబాయ్లో భారత సినీ నిర్మాత ఫ్యామిలీ మృతి
దుబాయ్: కేరళ రాష్ట్రానికి చెందిన సినీ నిర్మాత, ఆయన కూతురు, భార్య అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. దుబాయ్లోని ఓ ఫ్లాట్లో కేరళకు చెందిన సినీ నిర్మాత సంతోష్ కుమార్, ఆయన భార్య మంజుల, కుమార్తె గౌరిల మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో గుర్తించినట్లు అక్కడి మీడియా కథనాలు వెలువరించాయి.
సంతోష్ కుమార్కు సౌపర్ణిక ఫిలింస్ అనే పేరుతో సొంత నిర్మాణ సంస్థ ఉంది. ఆయన ‘మదాంబి' అనే మలయాళ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఐదేళ్ల క్రితం దుబాయ్కి వెళ్లిన సంతోష్ కుమార్ అక్కడే వ్యాపారం చేసుకుంటున్నారు.

కాగా, మృతదేహాలకు కత్తిపోట్లు ఉన్నాయని మృతుడి బంధువులు చెబుతున్నారు. అయితే ఈ ఆరోపణలపై స్పందించేందుకు దుబాయ్ పోలీసులు నిరాకరిస్తున్నారు. సినీ నిర్మాత కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే సినీ నిర్మాత సంతోష్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని మరికొందరు అనుమానిస్తున్నారు.
అయితే ఇప్పటి వరకు మృతికి గల సరైన కారణాలు తెలియరాలేదు. గత గురువారం నుంచి సంతోష్ కుమార్ కుటుంబంలో ఎవరూ ఫోన్లో దొరకకపోవడంతో ఆయన సమీప బంధువు ఒకరు ఫిర్యాదు చేయడంతో పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లారు. ముగ్గురి మృతదేహాలు బెర్రూంలో కనిపించాయి.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications