ఓ టీవీ యాంకర్ ప్రశ్న... సర్జికల్ దాడులకు కారణమైంది: పారికర్
ఓ టీవీ యాంకర్ అడిగిన అవమానకర ప్రశ్నే.. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ సర్జికల్ దాడులు చేసేందుకు కారణమైందట. ఈ విషయాన్ని మాజీ రక్షణ మంత్రి, గోవా ప్రస్తుత ముఖ్యమంత్రి మనోహర్ పారికర్
పనాజీ: ఓ టీవీ యాంకర్ అడిగిన అవమానకర ప్రశ్నే.. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భారత్ సర్జికల్ దాడులు చేసేందుకు నాంది పలికిందని మాజీ రక్షణ మంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ అన్నారు.
గోవాలో జరిగిన పారిశ్రామికవేత్తల సమావేశంలో పాల్గొన్న ఆయన.. గతేడాది భారత్ చేపట్టిన సర్జికల్ దాడుల గురించి ప్రస్తావించారు. ఆ దాడులపై 15 నెలల ముందు నుంచే ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.

2015 జూన్ 4న మణిపూర్లోని చందెల్ జిల్లాలో భారత జవాన్ల కాన్వాయ్పై మిలిటెంట్లు దాడి చేశారు. ఆ ఘటనలో 18 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలిసి తాను చాలా బాధపడినట్లు పారికర్ వెల్లడించారు.
కనీసం 200 మంది కూడా లేని ఓ చిన్న ఉగ్రవాద సంస్థ 18 మంది భారత జవాన్ల ప్రాణం తీసిందని తెలిసి తనకు అవమానంగా అనిపించిందని, దీంతో ఉగ్రవాదులకు దీటుగా బదులివ్వాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
సైన్యంతో సమావేశమై.. అదే ఏడాది జూన్ 8న భారత్-మయన్మార్ సరిహద్దుల్లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసి.. 70 నుంచి 80 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు పారికర్ తెలిపారు.
ఆ దాడులు విజయవంతమైన తర్వాత కేంద్రమంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ను ఓ విలేకరి ప్రశ్నించారని, 'ఇలాంటి దాడులనే పశ్చిమ సరిహద్దుల్లోనూ చేసే ధైర్యం, సామర్థ్యం మీకున్నాయా? అని ఆ విలేకరి అడిగారని చెప్పారు.
పశ్చిమ సరిహద్దులంటే పాకిస్తాన్తోనేనని, ఆ ప్రశ్న వినగానే తనకు చాలా అవమానకరంగా అన్పించిందని. ఆ మరుసటి రోజు నుంచే సర్జికల్ దాడులకు ప్రణాళిక రూపొందించామని, అలా 2016 సెప్టెంబర్ 29న పాక్ ఆక్రమిత కశ్మీర్లో సర్జికల్ దాడులు చేపట్టామని పారికర్ పేర్కొన్నారు.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
మన వాయుసేనలో పాక్ గూఢచారి: దేశ భద్రతను పాకిస్థాన్కు తాకట్టు -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
ప్రపంచంలోనే తొలి స్థానంలో పాకిస్థాన్.. ఆ ఒక్క విషయంలో.. -
ఇరాన్ పై దాడికి పాకిస్తాన్ ? తెరపైకి సౌదీతో రక్షణ ఒప్పందం..! -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..!












Click it and Unblock the Notifications