మోడీ చిట్కా: కరోనా వల్ల తలెత్తే శ్వాసకోశ ఇబ్బందులను ఇలా అధిగమించవచ్చు: ప్రధాని
న్యూఢిల్లీ: అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి దేశ ప్రజల ముందుకొచ్చారు. ఆదివారం తెల్లవారు జామున 6:30 గంటలకు ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో తరచూ జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తోన్న ప్రధానమంత్రి.. ఈ సారి భిన్న సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని దేశ ప్రజల ముందుకొచ్చారు. యోగా విశిష్టతలను గురించి వివరించారు. తనకు తెలిసిన కొన్ని వైద్యపరమైన చిట్కాలనూ వివరించారు.
Recommended Video

శ్వాసకోశ ఇబ్బందులను అధిగమించడానికి
కరోనా వైరస్ బారిన పడిన వారిలో తలెత్తే ప్రధాన అనారోగ్య సమస్య.. శ్వాసకోశ ఇబ్బందులు. కరోనా వైరస్ మన శ్వాసకోశాన్ని ప్రభావితం చేయడం వల్ల శ్వాస తీసుకోవడానికి పేషెంట్లు ఇబ్బంది పడతారు. కరోనా మరింత తీవ్రంగా మారితే.. ఊపిరి తీసుకోవడానికి పేషెంట్లు కష్టపడాల్సి వస్తుంది. శ్వాస తీసుకోవడంలో తలెత్తే ఇబ్బందులను అధిగమించడానికి యోగాలో చిట్కాలు ఉన్నాయని ప్రధాని వివరించారు. దాని ద్వారా ఈ సమస్య నుంచి బయటపడటానికి చాలా వరకు ప్రయత్నించవచ్చనీ అన్నారు.

ప్రాణాయామం ద్వారా
యోగాసనాల్లో కీలకమైన ప్రాణాయామం ద్వారా శ్వాసకోశ ఇబ్బందుల నుంచి అధిగమించవచ్చని నరేంద్ర మోడీ వివరించారు. ప్రతి ఒక్కరూ ప్రాణాయామాన్ని నేర్చుకోవాలని సూచించారు. సాధారణ పరిస్థితుల్లోనూ ప్రాణాయామం వల్ల శారీరకంగా, మానసికంగా ధృడత్వాన్ని సాధించవచ్చని చెప్పారు. భారతీయుల మూలాల్లో ప్రాణాయామ వ్యవస్థ ఉందని గుర్తు చేశారు. శతాబ్దాల కిందటే ప్రాణాయామాన్ని ఆచరించే వారని చెప్పుకొచ్చారు.

ఇళ్లల్లోనే యోగా..
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తమ ఇళ్లల్లోనే ఉంటూ యోగాసనాలను వేయాలని మోడీ విజ్ఙప్తి చేశారు. ఫలితంగా కుటుంబ సభ్యులతో అనుబంధం మరింత బలపడుతుందని అన్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అంతరాన్ని, దూరాన్ని యోగా తగ్గిస్తుందని చెప్పారు. పిల్లలు, పెద్దలు, యువకులు, మహిళలు.. ఇలా అన్ని వయస్సుల వారూ యోగాసనాలను వేయడాన్ని తమ జీవితంలో ఓ భాగంగా చేసుకోవాలని నరేంద్ర మోడీ సూచించారు.

మనోబలానికి యోగా
అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ సడలని మానసిక ధృఢత్వాన్ని సాధించడాని యోగా ఉపయోగపడుతుందని, స్వామి వివేకానంద సైతం ఈ విషయాన్ని వెల్లడించారని అన్నారు. ప్రధాని అన్నారు. కరోనా వైరస్ వల్ల ఏర్పడిన సంక్షోభ, సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా భారత్ ధైర్యంగా నిల్చుందని, దీనికి ప్రధాన కారణం యోగా మంత్రమేనని చెప్పారు. ఈ సందర్భంగా మోడీ.. తన ప్రసంగంలో స్వామి వివేకానందుడి సూక్తులను ఉటంకించారు. భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను ఉచ్ఛరించారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications