ఇంటర్నెట్ సెన్సేషన్: 'గుడ్లుక్' మహిళా ఐపీఎస్ ఇలా
తిరువనంతపురం: కేరళకు చెందిన ఐపీఎస్ శిక్షణలో ఉన్న మెరిన్ జోసెఫ్ ఫోటో ఇంటర్నెట్లో హల్చల్ సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
ఆమెను కొచ్చి కొత్త ఏసీపీగా భావిస్తూ ఇంటర్నెట్లో ప్రచారం జరిగింది. దీని పైన ఆమె తన ఫేస్బుక్లో స్పందించారు. అనంతరం దానిని డీయాక్టివేట్ చేశారు.
తాను క్లారిఫికేషన్ ఇస్తున్నానని, తాను కొచ్చికి కొత్తగా వచ్చిన ఏసీపీని కాదని, తాను ఇప్పటికీ ట్రెయినింగులో ఉన్నానని, హైదరాబాద్ ఎన్పీఏలో శిక్షణలో ఉన్నానని, తాను జనవరిలో ఛార్జ్ తీసుకుంటానని, అప్పుడు మళ్లీ అప్ డేట్ చేస్తానని ఆమె పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వచ్చే నిరాధార వార్తలు నమ్మవద్దని ఆమె పేర్కొన్నారు.
మెరినా జోసెప్
కేరళకు చెందిన ఐపీఎస్ అధికారిణి మెరిన్ జోసెప్ యొక్క ఫోటో ఫేస్బుక్లో బాగా షేర్ అవుతోన్న విషయం తెలిసిందే. ఆమె కొచ్చిలో రెండు వారాల పాటు శిక్షణ కోసం వచ్చి వెళ్లారు.
మెరినా జోసెప్
ఆమె మంచి లుక్ కలిగి ఉన్నారు. దీంతో ఆమె ఫోటో బాగా షేర్ అవుతోంది. ఆమె చేతిలో అరెస్టు అయినా అభ్యంతరం లేదనే కామెంట్లు కూడా పెడుతున్నారని చెబుతున్నారు.
మెరినా జోసెప్
ఆమె కొచ్చికి వస్తున్న నేపథ్యంలో ఆమెకు స్వాగతం పలుకుతూ ఫేస్బుక్లో ఓ ఫోటోను పోస్ట్ చేశారు. ఈ ఫోటో పోస్ట్ చేసిన ఒక్క రోజులోనే పదివేల లైక్స్ వచ్చాయి. ఈ ఫోటో వాట్సప్లో కూడా బాగా షేర్ అవుతోంది.
మెరినా జోసెప్
చాలామంది ఆమె కెరీర్ బాగుండాలని విష్ చేస్తున్నారు. మెరీన్ జోసెప్ రెండు వారాల ఐపీఎస్ శిక్షణ కోసం కొచ్చి వచ్చారు. ఆమె కొచ్చిలో శిక్షణకు వచ్చి తిరిగి వెళ్లి పోయారని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసు ముహమ్మద్ రఫిక్ చెప్పారు.
మెరినా జోసెప్
ఈమె ఇటీవలె వై20 పేరిట ఆస్ట్రేలియాకు వెళ్లే యువ బృందానికి కూడా ఎంపికయ్యారు. మెరీన్ జోసెఫ్ 2012లో సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే సాధించారు.
మెరినా జోసెప్
ఈమె ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కళాశాల నుండి తన బీఏ హానర్స్ పూర్తి చేశారు. ప్రస్తుతం కేరళలో ఇద్దరు మలయాళీ ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఒకటి ఆర్ శ్రీలేఖ, రెండోవారు. బీ సంధ్య.