జయలలిత మృతిపై విచారణ కమిషన్: అంతే గడువు, పత్రేక అధికారాలు, ఏం జరిగింది?
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై మూడు నెలల్లో విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని తమిళనాడు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. జయలలిత మృతిపై విచారణ కోసం ప్రభుత్వం ప్రత్యేక కమిషన్ ను ఏర్పాటు చేసింది.
మద్రాసు హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ప్రత్యేక విచారణ కమిషన్ కు చైర్మన్ గా వ్యవహిరిస్తున్నారు. జయలలిత మరణంపై విచారణ చేపట్టిన ప్రత్యేక కమిషన్ కు తమిళనాడు ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ ప్రత్యేక అధికారాలు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు.

2016 సెప్టెంబర్ 22వ తేది జయలలిత ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి డిసెంబర్ 5వ తేది ఆమె మరణించే వరకు ఏమి జరిగింది ? అని విచారణ పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. సోమవారం జయలలిత మృతిపై విచారణ చెయ్యడానికి ప్రత్యేక కమిషన్ వేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
సెప్టెంబర్ 27వ తేదీన విచారణ కమిషన్ కు ప్రత్యేక అధికారాలు ఇస్తూ తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ లేఖలు ఇవ్వడంతో విచారణ మొదలైయ్యింది. విచారణ కమిషన్ జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సయయంలో ఆమె దగ్గర ఎవరెవరు ఉన్నారు ? చికిత్స ఎలా చేశారు ? అని పూర్తి వివరాలు సేకరించనున్నారు.












Click it and Unblock the Notifications