జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు: తొలి దశలో పోటీ పడనున్న 685 మంది అభ్యర్థులు
రాంచీ: బుధవారం 58 నామినేషన్ల ఉపసంహరణ తర్వాత జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల మొదటి దశ కోసం మొత్తం 685 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారని ఎన్నికల అధికారి తెలిపారు. రాష్ట్రంలోని 43 అసెంబ్లీ నియోజకవర్గాలకు నవంబర్ 13న తొలి దశ పోలింగ్ జరగనుంది.
మొత్తం 43 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 805 మంది అభ్యర్థులు అక్టోబర్ 18 నుంచి 25 వరకు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. పరిశీలన తర్వాత 743 మంది అభ్యర్థుల నామినేషన్లు ఆమోదించినట్లు తెలిపారు. జార్ఖండ్ ఎన్నికల తొలి రౌండ్లో మొత్తం 685 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని సీఈవో కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు.

జంషెడ్పూర్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 28 మంది అభ్యర్థులు నమోదు కాగా, జగన్నాథ్పూర్లో అత్యల్పంగా 8 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారని ఆయన తెలిపారు. 2019లో 43 స్థానాల్లో 633 మంది అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేశారు. రాష్ట్రంలోని 81 మంది సభ్యుల అసెంబ్లీకి నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 23 న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల రెండవ దశ నామినేషన్ ప్రక్రియ మంగళవారం ముగిసింది. 634 మంది అభ్యర్థులు తమ పత్రాలను దాఖలు చేస్తున్నారు. 38 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 20న ఎన్నికలు జరగనున్నాయి. జార్ఖండ్ రెండో దశ ఎన్నికల నామినేషన్ల పరిశీలన బుధవారం జరిగిందని జార్ఖండ్ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కే రవి కుమార్ మీడియాకు తెలిపారు.
శుక్రవారం ఉదయం 11 గంటలలోపు అవసరమైన సమాచారాన్ని అందించాలని కొంతమంది నామినీలను కోరినట్లు కుమార్ తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ప్రకటన అనంతరం రాష్ట్రంలో మొత్తం రూ. 121.14 కోట్ల నగదు, వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అత్యధికంగా జార్ఖండ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన ప్రకారం ఖుంటిలో రూ. 3.03 కోట్లు, గిరిడిహ్లో రూ. 2.80 కోట్లు, తూర్పు సింగ్భూమ్లో రూ. 1.97 కోట్లు నగదు, వస్తువులు గరిష్టంగా రికవరీ చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. రాంచీలోని నామ్కుమ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాల నుంచి సుమారు రూ. 1.14 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. మోడల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు ఇప్పటివరకు 22 ఎఫ్ఐఆర్లు నమోదు చేశామని, నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటున్నామని సదరు అధికారి తెలిపారు.












Click it and Unblock the Notifications