హలో... టూర్ అంతా బాగానే జరిగింది.. వచ్చాం!!
జార్కండ్లో తలెత్తిన రాజకీయ సంక్షోభం ఒక కొలిక్కి వస్తోంది. రాయ్పూర్కు మకాం మార్చిన యూపీయే ఎమ్మెల్యేలు 30 మంది రాంచీకి తిరుగుపయనమయ్యారు. స్వామి వివేకానంద అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వీరంతా అక్కడి నుంచి రాంచీ చేరుకుంటారు. విమానాశ్రయంలో వీరికోసం రెండు బస్సులను ఏర్పాటు చేశారు. వీటిల్లోసర్క్యూట్ హౌస్కు చేరుకొని నేరుగా అసెంబ్లీకి హాజరవుతారు.

జార్కండ్కు చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలుచేసే అవకాశాలున్నాయంటూ వార్తలు రావడంతో వీరిని రాయ్పూర్ కు తరలించారు. సీఎం హేమంత్ సోరెన్ ఎమ్మెల్యేగా కొనసాగే అవకాశాలపై సందిగ్ధత ఇంకా వీడలేదు. ఈనెల ఐదోతేదీన అసెంబ్లీ ప్రత్యేక సమావేశం జరగబోతోంది. సభలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. విశ్వాస తీర్మానానికి సీఎం సోరెన్ సుముఖత వ్యక్తం చేసినట్లుగా ఎమ్మెల్యేలకు పంపిన లేఖలో అసెంబ్లీ సచివాలయం వెల్లడించింది. తన పేరుమీద మైనింగ్ లీజు తీసుకున్నారంటూ సీఎంపై ఆరోపణలు రావడంతో ఆయనపై అనర్హత వేటు పడే అవకాశం ఉంది. దీనిపై స్పష్టత వస్తే హేమంత్ సోరెన్ సతీమణి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలున్నాయని యూపీఏ వర్గాలు వెల్లడించాయి.
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..











Click it and Unblock the Notifications