కర్నాటకలో దేవెగౌడ, శివకుమార్ ను ఏకం చేసిన బీజేపీ సర్కార్ నిర్ణయం- టెక్స్ట్ బుక్స్ వివాదంతో
కర్నాటకలో బీజేపీ సర్కార్ అనుసరిస్తున్న మైనార్టీల వ్యతిరేక ధోరణులతో ఇప్పటికే విపక్షాలు కాంగ్రెస్, జేడీఎస్ మరోసారి ఏకమవుతుండగా.. తాజాగా మరో వివాదం ఈ రెండు పార్టీల్లో అగ్రనేతల్ని కలిపింది. అదే పాఠ్యపుస్తకాల వివాదం. కన్నడలో వక్కళిగ కులానికి చెందిన కవి, రచయిత కువెంపు ఫొటోల్ని సోషల్ టెక్స్ బుక్స్ లో నుంచి తొలగిస్తూ బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై వక్కళిగ నేతలైన శివకుమార్, దేవెగౌడ రగిలిపోతున్నారు.
కర్ణాటకలో సాంఘిక శాస్త్రాలు మరియు కన్నడ కోసం తాజాగా రూపొందించిన కొత్త పాఠశాల పాఠ్యపుస్తకాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ యూనివర్సల్ హ్యుమానిటీ అండ్ కువెంపు ఆజిటేషన్ ఫోరమ్ అనే సంస్థ జూన్ 18న బెంగళూరులో నిరసన సభను నిర్వహించింది. అయితే మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ , రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు శివకుమార్ దీనికి హాజరయ్యారు. చాలాకాలం తర్వాత ఒకే వేదికపైకి వచ్చిన ఈ రెండు వివక్ష పార్టీల అగ్రనేతలు.. రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన ఒక ఈవెంట్కు రాజకీయ రంగు పులిమారు.
జనతాదళ్ (సెక్యులర్)కు చెందిన 89 ఏళ్ల దేవెగౌడ, పీసీసీ ఛీఫ్ 60 ఏళ్ల శివకుమార్ ఇద్దరూ వొక్కలిగ సామాజిక వర్గానికి చెందినవారే. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కర్నాటక రాజకీయాల్లో వీరిద్దరూ ఒకే వేదికపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే వారి పార్టీలు దక్షిణ కర్ణాటకలో వొక్కలిగ మద్దతు కోసం పోటీ పడుతున్నాయి అలాగే అధికార బిజెపి తన హిందూత్వ అనుకూలతతో సమాజంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తోంది. వక్కళిగ సామాజిక వర్గానికి చెందిన దేవెగౌడకు చెందిన జేడీఎస్ పార్టీ ప్రభావంతో 2004, 2008, 2018లో రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు.
ఈ నేపథ్యంలో రచయిత రోహిత్ చక్రతీర్థ నేతృత్వంలోని కమిటీ నిర్వహించిన పాఠశాల పాఠ్యపుస్తకాల సవరణ ప్రక్రియలో కవి, రచయిత కె వి పుటప్ప లేదా కువెంపుకు జరిగిన అవమానమే ఇప్పుడు జేడీఎస్, కాంగ్రెస్ అగ్రనేతల్ని ఒకే వేదికపైకి చేర్చింది. బెంగళూరు రూరల్ ప్రాంతంలో శివకుమార్ ప్రబలమైన ప్రభావంతో పోలిస్తే దేవెగౌడ, కుమారస్వామిల రాజకీయ ప్రభావం వొక్కలిగ సంఘం, కర్ణాటక అంతటా విస్తృతంగా ఉంది. శివకుమార్ ఈ పరిస్థితిని మార్చి వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు మరింత ప్రభావవంతమైన వొక్కలిగ నాయకుడిగా ఎదగాలని ప్రయత్నిస్తున్నారు.కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో జేడీ(ఎస్) అధినేత కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో శివకుమార్తో కలిసి పని చేయడంతో గౌడ కుటుంబానికి, శివకుమార్కు మధ్య ఒకప్పుడు ఉన్న హోరాహోరీ పోటీ చాలా వరకు తగ్గింది.