Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కర్ణాటక సీఎం పదవి వివాదం: ఖర్గే తుది సమాధానం ఇదే!

కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న సీనియర్ నేతల మధ్య జరుగుతున్న అంతర్గత పోరాటంపై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతను పరిష్కరించడానికి త్వరలో నేరుగా చర్చలు నిర్వహిస్తామని ఆయన గురువారం ప్రకటించారు. చర్చల ద్వారా తుది నిర్ణయం తీసుకుంటామన్నారు.

బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఖర్గే.. ఈ సమస్యపై తుది నిర్ణయం అధిష్ఠానం ద్వారా తీసుకోబడుతుందని స్పష్టం చేశారు. "నేను ఇప్పుడు అందరినీ పిలుస్తాను, చర్చిస్తాను. ఆ చర్చలో రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారు. ఇతర సభ్యులు కూడా ఉంటారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌లను కూడా ఆ సమావేశంలో కూర్చోబెడతాం.అందరితో చర్చించిన తర్వాతే సీఎం పదవి గురించి ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇది కేవలం నేను ఒక్కడినే తీసుకునే నిర్ణయం కాదు. మొత్తం హైకమాండ్ టీమ్ చర్చించి తుది నిర్ణయం తీసుకుంటుంది" అని మల్లిఖార్జున్ ఖర్గే తెలిపారు. ఈ ప్రకటన ద్వారా ఈ ఇద్దరు కీలక నేతల మధ్య సయోధ్య కుదర్చడానికి కాంగ్రెస్ నాయకత్వం నేరుగా రంగంలోకి దిగనున్నట్లు స్పష్టమవుతోంది.

Karnataka CM Post Crisis Mallikarjun Kharge Steps In With Final Mediation Plan

డీకే శివకుమార్ చేసిన పోస్ట్ ఏమిటీ?
సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తుందనే ఊహాగానాల మధ్య.. డీకే శివకుమార్ ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేశారు. ఈ పోస్ట్ ద్వారా ఆయన హైకమాండ్‌కు ఏదైనా సంకేతం ఇస్తున్నారేమోనని విశ్లేషకులు భావిస్తున్నారు. డీకే శివకుమార్ తన పోస్ట్‌లో ఇలా రాసుకొచ్చారు. "పదాల శక్తియే ప్రపంచానికి శక్తి. ప్రపంచంలో అతిపెద్ద శక్తి తమ అభిప్రాయాన్ని చెప్పడమే. అది న్యాయమూర్తి అయినా, అధ్యక్షుడు అయినా లేదా ఎవరైనా, నేను కూడా అందులో భాగమే, అందరూ తమ మాటపై నిలబడాలి." అంటూ ఆ పోస్టులో పేర్కొన్నారు.

📢 సీనియర్ నేతల సంచలన వ్యాఖ్యలు
ఈ వివాదంపై సీనియర్ కాంగ్రెస్ శాసనసభ్యుడు, మాజీ మంత్రి కె.ఎన్. రాజన్న చేసిన వ్యాఖ్యలు మరింత గందరగోళాన్ని సృష్టించాయి. "మనం అసెంబ్లీని రద్దు చేసి, ఎన్నికలను ఎదుర్కొందాం. ఆపై డీకే శివకుమార్ నాయకత్వంలో కలిసి పనిచేసి, మెజారిటీ సాధిద్దాం. అప్పుడు ఆయనను 5 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పనిచేయనిద్దాం" అని రాజన్న అన్నారు. "సీఎల్పీ (కాంగ్రెస్ శాసనసభాపక్షం) సిద్ధరామయ్యను ఎన్నుకోలేదా? ఇప్పుడు నిర్ణయం సీఎల్పీకి వదిలివేయాలి" అని ఆయన వ్యాఖ్యానించారు.

రాజన్న సిద్ధరామయ్యకు మద్దతు పలకడంతో పాటు, రాష్ట్ర హోం మంత్రి జి. పరమేశ్వర్ పేరును ముఖ్యమంత్రి పదవికి రెండో ప్రత్యామ్నాయంగా సూచించారు. "వ్యక్తిగతంగా నా కోరిక ఏమిటంటే, సిద్ధరామయ్య ఐదేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండాలి. కాంగ్రెస్ దీనిపై త్వరలో స్పష్టత ఇస్తుంది. లేదంటే.. డా. జి. పరమేశ్వర్ సీఎం అయ్యేందుకు రెండో ఆప్షన్ ఉంది," అని ఆయన పేర్కొన్నారు. ఈ విధంగా కర్ణాటకలో ముఖ్యమంత్రి పదవి కోసం జరుగుతున్న అంతర్గత పోరాటంపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి పెట్టింది, తుది నిర్ణయం కోసం అందరినీ చర్చలకు పిలవాలని ఖర్గే నిర్ణయించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+