Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Forest: ఇంట్లోదూరి రైతును చితకబాదిన అటవి శాఖ అధికారులు !

బెంగళూరు/ తుమకూరు: అడవిని ఆక్రమించుకున్న రైతు దర్జాగా వ్యవసాయం చేస్తున్నాడని ఆరోపిస్తూ అటవి శాఖ అధికారులు ఆ రైతు ఇంట్లో దూరి చితకబాదిన సంఘటన కలకలం రేపింది. రైతు ఇంట్లో ఉంటే అటవి శాఖ అధికారులు, సిబ్బంది దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

కర్ణాటకలోని తుమకూరు జిల్లాలోని గుబ్బి తాలుకాలోని నల్లూరు గ్రామం సమీపంలోని చేళూరులో బసవరాజ్ అనే రైతు ఉన్నాడు. అటవి శాఖకు చెందిన భూమిని రైతు బసవరాజ్ ఆక్రమించుకుని వ్యవసాయం చేస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.

Karnataka forest officer and staffs assault on farmer near Tumakuru

నువ్వు ఎందుకు అటవి శాఖ భూమిని ఆక్రమించుకున్నావని ఇంత వరకు రైతు బసవరాజ్ ను అటవి శాఖ అధికారులు ప్రశ్నించలేదని, కనీసం నోటీసులు కూడా ఇవ్వలేదని తెలిసింది. ఇంట్లో భోజనం చెయ్యడానికి ప్లేట్ ముందు పెట్టుకున్న బసవరాజ్ కు అతని భార్య అన్నం వడ్డిస్తున్న సమయంలో అటవి శాఖకు చెందిన కొందరు అధికారులు అతని ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు.

మద్యం మత్తులో ఉన్న అటవి శాఖ అధికారులు తనను మాట్లాడటానికి అవకాశం కూడా ఇవ్వకుండా కర్రలు తీసుకుని చితకబాదేశారని, వెంటనే అక్రమించుకున్న భూమిని వదిలేయాలని తన మీద దౌర్జన్యం చేశారని బసవరాజ్ పోలీసులను ఆశ్రయించారు. భోజనం చేస్తున్న బసవరాజ్ ను అతని ఇంట్లోకి దూరి చితకబాదేశారని, వెంటనే అటవి శాఖ అధికారులు, సిబ్బంది మీద కేసు నమోదు చెయ్యాలని డిమాండ్ చేస్తూ రైతు బసవరాజ్, అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో గుబ్బి తాలుకాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+