కరోనా లాక్డౌన్: వాట్సాప్లో లిస్ట్ ఇస్తే.. ఇంటికే నిత్యావసర సరుకులు
బెంగళూరు: కరోనా కట్టడి కోసం విధించిన లాక్డౌన్ను కర్ణాటక రాష్ట్రంలో కఠినంగా అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఓ కొత్త ఆలోచనను అమలు చేస్తోంది. నిత్యావసరాలను ప్రజల ఇంటివద్దకే పంపించాలని నిర్ణయించింది. దీని కోసం ప్రత్యేకంగా ఓ వాట్సాప్ నెంబర్ను కూడా కేటాయించింది.
సరుకులు అవసరం ఉన్నవారు సంబంధిత వాట్సాప్ నెంబర్కు సరుకుల జాబితాను పంపిస్తే సరిపోతుంది. స్థానిక ఏజెంట్లుసరుకులను ఇంటికే తీసుకొచ్చి ఇస్తారు. ఈ మేరకు ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప 08061914960 హెల్ప్ లైన్ నెంబర్ ను ప్రారంభించారు. ఈ సదుపాయాన్ని ప్రయోగాత్మకంగా బెంగళూరులోనే ప్రారంభిస్తున్నట్లు సీఎం ఈ సందర్భంగా తెలిపారు.
ఇందు కోసం వివిధ ప్రైవేటు సంస్థల నుంచి బెంగళూరు నగరంలో దాదాపు 5వేల మంది ఏజెంట్లు పనిచేస్తారని తెలిపారు. దీంతో నిత్యావసర వస్తువుల కోసం బయటికి వచ్చేవారి సంఖ్య తగ్గుతుందన్నారు.
సరుకులు ఎలా పొందాలనే విషయాన్ని కూడా అధికారులు వెల్లడించారు.
మొదటగా
08061914960
నెంబర్
ను
ప్రజలు
తమ
మొబైల్
ఫోన్లో
సేవ్
చేసుకోవాలతి.
హెల్ప్
లైన్
నెంబర్
కు
HI
మెసేజ్
పెట్టి,
మీ
లోకేషన్
ను
లేడా
అడ్రస్
ను
షేర్
చేయాలి.
మీకునిత్యావసర
సరుకులు
కావాలా?
మెడిసిన్
కావాలా?
అని
అడుగుతుంది.
కావాల్సిన
సరుకులను
టైప్
చేసిగానీ,
ఓ
పేపర్
పై
రాసి
గానీ
ఆ
ఫొటోను
పంపించాలి.
ఆ
ఆర్డర్
రిసీవ్
చేసుకున్నట్లు
మీకు
రిప్లై
కూడా
వస్తుంది.
ఆ
తర్వాత
సదరు
ఏజెంట్
మీకు
సరుకులు
తీసుకొచ్చి
ఇస్తారు.
బిల్లు
చెల్లిస్తే
చాలు,
అయితే,
డెలివరీ
ఛార్జీల
కింద
రూ.
10
అదనంగా
చెల్లించాల్సి
ఉంటుంది.
No need to step out for groceries, veggies or medicines during this #lockdown! CM @BSYBJP today inaugurated a home delivery helpline introduced by #BBMP & Karnataka State Disaster Management Authority. Follow the steps illustrated in the accompanying graphic to order.#Bengaluru pic.twitter.com/I7mUsNVa2l
— B.H.Anil Kumar,IAS (@BBMPCOMM) April 21, 2020