మా కులం నాయకుడికి ఎందుకు సీఎం పదవి ఇవ్వకూడదు ?, మా ఓట్లు కావాలి అంతేనా, స్వామీజీ ఫైర్ !
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 135 సీట్లు రావడంతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సిద్దరామయ్య ప్రభుత్వం కొలువుతీరి ఆరు నెలలు పూర్తికాకముందే ముఖ్యమంత్రి మార్పుపై సర్వత్రా చర్చ సాగుతోంది, ఈలోగా దళితులను సీఎంచ చెయ్యాలని పలువురు నాయకులు జోరుగా డిమాండ్ చేస్తున్నారు.
కర్ణాటకలోని బాగల్కోట్లోని వాల్మీకి గురుపీఠ్ మఠానికి చెందిన శ్రీప్రసన్నానంద స్వామీజీ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత నాయకుడిని సీఎం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. మంత్రి సతీష్ జారకిహోళికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందన, కర్ణాటకకు దళితులు ఎందుకు ముఖ్యమంత్రి కాకూడదని స్వామిజీ ప్రశ్నించారు. దళితుల ఓటు బ్యాంకు కావాలని, అయితే దళితులకు మాత్రం ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఇవ్వరని స్వామిజీ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి పదవిని ఎవరైనా లీజు తీసుకున్నారా? లేదా అగ్రిమెంట్ చేసి ఇచ్చారా ? అంటూ శ్రీప్రసన్నానంద స్వామీజీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నాయకులను ప్రశ్నించారు. దళితులకు సీఎం అయ్యే అర్హత లేదా ?, లేకపోతే దళితుల ఓట్లు ఎందుకు అడుగుతున్నారు అంటూ స్వామీజీ కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించారు. ఈ విషయమై శ్రీప్రసన్నానంద స్వామీజీ మీడియాతో మాట్లాడుతూ దళితులకు సీఎం అయ్యే అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియడం లేదని విచారం వ్యక్తం చేశారు.
బాగల్కోట జిల్లా వాల్మీకి ప్రజా చైతన్య సదస్సు నిర్వహించిన స్వామిజీ తరువాత మాట్లాడారు. ఈ సమయంలో వాల్మీకి గురుపీఠం రాజనహళ్లిలోని ప్రసన్నానంద స్వామీజీ దళితుడిని ఎందుకు సీఎం చేయకూడదని బహిరంగంగా ప్రశ్నించారు. దానికి తోడు దళిత నాయకులు సీఎం అయ్యే సమయం కోసం ఎదురుచూడాల్సి వస్తుందని చెప్పారు.

దళితుల శాసనసభ్యులు చాలా మంది ఉన్నారని, అన్నీ కలిసొచ్చినప్పుడే అవకాశం వస్తుందని, అది మన కోరిక కావచ్చు, కులం సంఘం నాయకుల కోరిక కావచ్చు అని, ఇక్కడ పార్టీ చాలా ముఖ్యం అని, పార్టీ హైకమాండ్ నిర్ణయమే అంతిమమని కర్ణాటక మంత్రి సతీష్ జారకిహోళి అన్నారు. ముఖ్యమంత్రి మార్పుపై మంత్రి సతీష్ జారకిహోళి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సీటు విషయంపై ఇప్పటికే సిద్ధరామయ్య మాట్లాడారని అన్నారు. నేను ఐదు సంవత్సరాలు సీఎంగా ఉంటానని సిద్దరామయ్య చెప్పారని, వేచి చూడాల్సిందే అని, సందర్భం వచ్చినప్పుడు చూద్దాం అని మంత్రి సతీష్ జారకిహోళి మాటదాటవేశారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications