కరుణానిధిని పరామర్శించిన రాహుల్ గాంధీ, ఆసుపత్రిలో ఇలా (ఫోటోలు)
Recommended Video

చెన్నై: డీఎంకే అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధిని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ పరామర్శించారు. 94 ఏళ్ల కరుణ చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ తదితరులతో కలిసి వచ్చిన రాహుల్ ఆయనను పరామర్శించారు.

కరుణానిధిని చూసిన తర్వాత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. తాను కరుణానిధిని చూసేందుకు చెన్నై వచ్చానని చెప్పారు. అతనిని తాను చూశానని, ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు. యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ ఆయన త్వరగా కోలుకోవాలని సందేశం పంపించిందని చెప్పారు. తమకు కరుణ కుటుంబంతో చాలాకాలంగా మంచి సంబంధాలు ఉన్నాయని తెలిపారు. అతను తమిళనాడు ఆత్మ అన్నారు.

కరుణానిధి చికిత్సకు స్పందిస్తున్నారని డీఎంకే నేత ఏ రాజా అంతకుముందు అన్నారు. కరుణానిధి ఆరోగ్యంపై ఎలాంటి ప్రచారాలను ఎవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కరుణను పలువురు నేతలు పరామర్శిస్తున్నారు.












Click it and Unblock the Notifications