వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రేప్ యత్నం, హత్య: మంత్రి వ్యక్తిగత ఉద్యోగి అరెస్టు

By Pratap
|
Google Oneindia TeluguNews

Kerala minister's personal staff arrested on murder charges
తిరువనంతపురం: కేరళలోని మళప్పురం జిల్లా నీలాంబర్‌లోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో పనిచేసే మహిళపై అత్యాచార యత్నానికి పాల్వడి, హత్య చేసిన కేసులో కాంగ్రెస్‌ మంత్రి వ్యక్తిగత సహాయకుడితో పాటు అతని మిత్రుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ పార్టీ కార్యాలయంలో స్వీపర్‌గా పని చేసే కె రాధ(49)పై అత్యాచార యత్నానికి పాల్పడ్డారని, ఆ తర్వాత హత్య చేశారని అంటున్నారు.

వివరాలు ఇలా ఉన్నాయి - ఆమెను హత్య చేసిన అనంతరం అనుమానం రాకుండా ఆమె మృతదేహాన్ని బండరాయితో కట్టి మురికికుంటలో పడేశారు. ఈ ఘటనలో విద్యుత్‌శాఖ మంత్రి ఆర్యదన్‌ ముహమ్మద్‌ వ్యక్తిగత సహాయకుడు బిజు నాయర్‌ను, కె షంషుద్దీన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అవివాహితులైన రాధా రెండున్నర సంవత్సరాలుగా పార్టీ కార్యాలయంలో పని చేస్తోంది. కేసు దర్యాప్తునకు ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు డిఎస్‌పి పెరింతాల్మన్న తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం - ఈ నెల 5న బాధితురాలిపై అత్యాచార యత్నం చేసి హత్య చేశారు. ఆమె మృతదేహాన్ని రెండు రోజుల పాటు కాంగ్రెస్‌ కార్యాలయంలో ఉంచారు. తరువాత మృతదేహాన్ని షంషుద్దీన్‌ కారులో చులియాడ్‌ ప్రాంతానికి తీసుకెళ్లారు. మృతురాలి సెల్‌ఫోన్‌ నీలాంబర్‌కు 44 కిలో మీటర్ల దూరంలో అంగడిప్పురంలో లభించింది.

మురుగుకాలువను శుభ్రం చేసేటప్పుడు ఆమె మృతదేహం గొనెసంచిలో కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం అందించడం ఘటన వెలుగు చూసింది. అయితే ఈ హత్యలో చాలా కీలక వ్యక్తులు ఉన్నారనీ, వారిని కాపాడేందుకు నాయర్‌ నేరం తనపై వేసుకుంటున్నాడని మృతురాలి సోదరుడు భాస్కరన్‌ అన్నారు.

English summary

 A personal staff of Kerala Power Minister Aryadan Muhammed was on Tuesday arrested along with his friend in connection with the murder of a middle-aged woman sweeper attached with the Congress office at Nilambur in the district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X