వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.45.69 లక్షల కరెన్సీ... అరటిపండ్లలో దాచిపెట్టి... దేశం దాటించబోయారు

అరటిపండ్లలోని గుజ్జును తీసేసి.. అందులో రూ.45.69 లక్షలు దాచిపెట్టి.. ఎవరికీ అనుమానం రాకుండా దేశం దాటించేందుకు ప్రయత్నించారు ఇద్దరు ప్రబుద్ధులు. చివరికి బండారం బయటపడి పట్టుబడిపోయారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

కోజికోడ్: నేరగాళ్లు తెలివి మీరిపోతున్నారు. కొత్త కొత్త పద్ధతులు, దారులు వెతుక్కుంటున్నారు. ఈ విషయం వింటే.. 'వార్నీ.. ఇలా కూడా చేస్తారా..?' అని అశ్చర్యపోతారు మీరు.

అరటిపండ్లలోని గుజ్జును తీసేసి.. అందులో రూ.45.69 లక్షలు దాచిపెట్టి.. ఎవరికీ అనుమానం రాకుండా దేశం దాటించేందుకు ప్రయత్నించారు ఇద్దరు ప్రబుద్ధులు. చివరికి బండారం బయటపడి పట్టుబడిపోయారు.

 Kerala: Two Dubai-bound passengers use bananas to smuggle Saudi currency

ఈ సంఘటన కోజికోడ్ లో చోటు చేసుకుంది. కోజికోడ్ విమానాశ్రయం నుంచి దుబాయ్ వెళ్తున్న ఇద్దరు ప్రయాణికులు తమ చెకిన్ లగేజీలో తీసుకెళుతున్న అరటి పళ్లలో గుజ్జును తీసేసి వాటిలో రూ.45.69 లక్షల విలువైన సౌదీ రియాల్స్ ను దాచి ఉంచారు.

అయితే వీరి పాచిక ఏమాత్రం పారలేదు. విమానాశ్రయంలో తనిఖీ అధికారులకు పట్టుబడిపోయారు. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజన్స్ అధికారులు ఈ డబ్బును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ ప్రయాణికులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు.

English summary
The Directorate of Revenue Intelligence (DRI) apprehended two Dubai-bound passengers who were allegedly trying to smuggle Saudi Riyal currency worth Rs 45.69 lakhs from Kozhikode Airport in Kerala, news agency ANI reported. The accused had concealed the cash inside a bunch of bananas which were later confiscated and checked by the DRI officials. The identities of the accused have not been revealed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X