షిండేకు ముచ్చెమటలు..గెలిచాననే ఆనందం కూడా లేకపాయె
మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని సాధించింది.. భారతీయ జనతా పార్టీ ప్రత్యేకించి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పై తన పట్టును నిరూపించుకోగలిగింది. మొత్తం 89 వార్డులను తన ఖాతాలో వేసుకోగలిగింది. బీజేపీకి ధీటుగా తడాఖా చూపింది శివసేన (ఉద్ధవ్ బాలా సాహెబ్ థాకరే) వర్గం. మిత్రపక్షం శివసేన (ఏక్నాథ్ షిండే వర్గం) 29 వార్డులకే పరిమితం కావడం ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్- 24, మజ్లిస్- 8 స్థానాలను దక్కించుకున్నాయి.
ముంబైలో పరిమితంగా వార్డులను దక్కించుకోవడం ఏక్నాథ్ షిండే వర్గంలో దుమారం రేపుతున్నాయి. ముంబై మేయర్ పదవికి సంబంధించిన కీలక చర్చలు ముంచుకొస్తున్న నేపథ్యంలో తన పార్టీ కార్పొరేటర్లను బీజేపీ ఎగరేసుకుపోకుండా ఏక్ నాథ్ షిండే జాగ్రత్త పడుతున్నారు. పోచింగ్ భయం పట్టుకుందాయనకు. ఈ క్రమంలో వారిని రక్షించుకోవడానికి క్యాంప్ రాజకీయాలు మొదలు పెట్టారు. శనివారం తన వర్గానికి చెందిన మొత్తం 29 మంది ఎన్నికైన ముంబై కార్పొరేటర్లను బాంద్రాలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్కు తరలించారు.

మేయర్ ఎంపిక ప్రక్రియ పూర్తయ్యే వరకు అక్కడే ఉంటారు. మొత్తం 227 వార్డులకు గాను బీజేపీకి 89 సీట్లు దక్కాయి. మేయర్ పదవిని దక్కించుకోవడానికి ఇవి చాలవు. మేయర్ పదవిని సాధించాలంటే 114 వార్డులు అవసరమౌతాయి. 25 వార్డుల తక్కువ పడ్డాయి. ఈ నేపథ్యంలో- తన పార్టీకి చెందిన కార్పొరేటర్లను బీజేపీ ఎక్కడ తన్నుకు పోతుందోననే ఆందోళన షిండే వర్గంలో నెలకొంది. దీంతో వారిని ఫైవ్ స్టార్ హోటల్ కు తరలించారు.
ముంబై రాజకీయాల్లో షిండే వర్గాన్ని 'కింగ్మేకర్గా' పరిగణిస్తున్నారు. సొంతంగా మేయర్ సీటులో ఆసీనులు కావడానికి అవసరమైనంత మెజారిటీ బీజేపీకి లేకపోవడంతో చక్రం తిప్పుతున్నారు షిండే. ముంబై మేయర్ పదవిని చెరిసగం పంచుకోవాలని, అలాగే మున్సిపల్ కార్పొరేషన్ బాడీలో కీలక పదవులు లభించాలని షిండే శివసేన ఆశిస్తోంది. దీనిపై బీజేపీ అధిష్ఠానం నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పష్టతా రాలేదు.
మరోవైపు.. పోచింగ్ వార్తలను ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తోసిపుచ్చుకున్నారు. షిండే వర్గానికి చెందిన కార్పొరేటర్లతో తాము ఎటువంటి మంతనాలు జరపట్లేదని, వారిని కొనుగోలు చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. షిండేతో కలిసి కూర్చుని అన్ని నిర్ణయాలను తీసుకుంటామని వ్యాఖ్యానించారు. మేయర్ ఎవరు, ఎన్ని సంవత్సరాలు ఉంటారు అనేది తామిద్దరం కలిసే నిర్ణయిస్తామని,, కార్పొరేషన్ను కలిసి నడుపుతామని అన్నారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications