నా కోరిక తీర్చు.. హాల్ టికెట్ తీసుకో: విద్యార్థినికి ఓ అధ్యాపకుడి ఆఫర్
లాగేసుకున్న హాల్టికెట్ తిరిగి ఇవ్వాలంటే తన కోరిక తీర్చాలంటూ ఓ విద్యార్థినిని వేధించిన ఓ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడికి అరదండాలు తగిలించారు పోలీసులు.
నాగ్పూర్: గౌరవప్రదమైన అధ్యాపక వృత్తిలో కొనసాగుతూ ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఇది. పరీక్షలో కాపీ కొడితే మందలించాలి.. లేదంటే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాలి.
కానీ ఈ అధ్యాపకుడు అలా చేయలేదు. ఆ ఘటనను తనకు అనుకూలంగా మలుచుకోవాలనుకున్నాడు. లాగేసుకున్న హాల్టికెట్ తిరిగి ఇవ్వాలంటే తన కోరిక తీర్చాలని పట్టుబడ్డాడు. బాధిత విద్యార్థిని దీని గురించి తన బంధువులకు, స్నేహితులకు చెప్పడంతో ఈ కీచకపర్వం కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే... నాగ్పూర్లోని ఓ పాలిటెక్నిక్ కళాశాలలో అమిత్ గన్వీర్ అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. మరో కళాశాలలో చదువుతూ.. తమ కళాశాలలో పరీక్ష రాసేందుకు వచ్చిన ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.
ఏప్రిల్ 13న జరిగిన పరీక్ష సమయంలో కాపీ కొడుతోందన్న ఆరోపణపై సదరు విద్యార్థిని గుర్తింపు కార్డు, హాల్ టికెట్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నాడు. వాటిని తిరిగి ఇవ్వాలంటే తన కోరిక తీర్చాలని, ఒక రాత్రి తనతో గడపాలని కోరాడు.
ఈ విషయాన్ని సదరు యువతి తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలిపి, వారి సలహా మేరకు అంబజరి పోలీస్స్టేషన్లో ఈ మేరకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి గురువారం ఆ కీచక అధ్యాపకుడిని అరెస్ట్ చేశారు.
నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. కాగా, విషయం వెలుగులోకి రావడంతో శివసేన, యువక్రాంతికి చెందిన కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన సదరు అధ్యాపకుడి ముఖానికి ఇంకు పూశారు.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications