Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Lok Sabha Election 2024 Polling LIVE : ముగిసిన లోక్‌సభ ఎ‍న్నికల తొలి విడత పోలింగ్‌

లోక్‌సభ ఎన్నికలు 2024 మొదటి విడత పోలింగ్ ప్రత్యక్ష ప్రసారం : 2024 సార్వత్రిక ఎన్నికలకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం ఏడు దశల్లో ముగిసే ఎన్నికలు ఇవి. తొలి విడత పోలింగ్ ఉదయం 7 గంటలకు మొదలైంది. మొత్తం 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 102 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. దక్షిణాదిన తమిళనాడులో మొత్తం 39 లోక్‌సభ నియోజకవర్గాలకూ పోలింగ్ తొలిదశలో ముగుస్తుంది.

దీనికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. జూన్ 1వ తేదీ నాటితో ఏడు దశల పోలింగ్ ముగుస్తుంది. అదే నెల 4వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. లోక్‌సభతో పాటు ఏపీ, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్‌లల్లో అసెంబ్లీకీ ఎన్నికలు జరుగుతాయి. ఆయా రాష్ట్రాల్లోని ఓటర్లు కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకొంటారు. అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశంలో ఓటర్లు ఎవరికి పట్టాభిషిక్తులను చేస్తారనేది 4వ తేదీన తేలిపోతుంది.

lok sabha election 2024 phase 1 polling live updates news in telugu for all states constituencies on april 19th

తొలిదశ పోలింగ్‌ను ఎదుర్కొంటోన్న నియోజకవర్గాల్లో ఇదివరకే ప్రచారానికి తెర పడింది. మిగిలిన చోట్ల ఎన్నికల ప్రచారం పతాకస్థాయికి చేరుకుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ- ఎన్డీఏ, ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలను ప్రదర్శిస్తోన్నాయి. దీనికోసం అవసరమైన వ్యూహాలను రూపొందించుకున్నాయి.

Apr 19, 2024, 6:25 pm IST

తొలి విడతలో భాగంగా దేశ వ్యాప్తంగా 102 పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది
Apr 19, 2024, 6:25 pm IST

ముగిసిన లోక్‌సభ ఎ‍న్నికల తొలి విడత పోలింగ్‌
Apr 19, 2024, 5:18 pm IST

తమిళ హీరో విజయ్ సేతుపతి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Apr 19, 2024, 4:29 pm IST
తమిళనాడు

Vishal
సైకిల్‌పై పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేసిన హీరో విశాల్
Apr 19, 2024, 4:25 pm IST
తమిళనాడు

Janani Iyer
చెన్నైలో ఓటు వేసిన హీరోయిన్ జననీ అయ్యర్
Apr 19, 2024, 4:23 pm IST
తమిళనాడు

Aishwarya Rajesh
చెన్నైలో ఓటు వేసిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్
Apr 19, 2024, 4:21 pm IST
తమిళనాడు

Tamil Nadu
మధ్యాహ్నం 3 గంటల వరకు నమోదైన పోలింగ్ శాతం 51.41 శాతం మేర పోలింగ్ నమోదైంది. ధర్మపురిలో అత్యధికంగా 57.86, అత్యల్పంగా చెన్నై సెంట్రల్‌లో 51.41 శాతం పోలింగ్ నమోదు.
Apr 19, 2024, 4:17 pm IST
తమిళనాడు

చెన్నై అడయార్‌లో ఓటు వేసిన ఏఎంఎంకే ప్రధాన కార్యదర్శి టీవీవీ దినకరన్
Apr 19, 2024, 4:00 pm IST
తమిళనాడు

మధ్యాహ్నం 3 గంటల వరకు 102 లోక్‌సభ నియోజకవర్గాల్లో నమదైన పోలింగ్ శాతం వివరాలను వెల్లడించిన కేంద్ర ఎన్నికల కమిషన్.
Apr 19, 2024, 3:59 pm IST
తమిళనాడు

చెన్నైలో తన ఓటు హక్కు వినియోగించుకున్న వీకే శశికళ
Apr 19, 2024, 2:04 pm IST
తమిళనాడు

తెన్‌కాశిలో తన ఓటు హక్కును వినియోగించుకున్న ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో
Apr 19, 2024, 2:01 pm IST
తమిళనాడు

Ramya Pandian
చెన్నైలో తన ఓటు హక్కును వినియోగించుకున్న తమిళనటి రమ్య పాండ్యన్
Apr 19, 2024, 1:59 pm IST
అరుణాచల్ ప్రదేశ్

Kiren Rijiju
ఇటానగర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. రెండు ఓట్లు వేశారాయన. లోక్‌సభతో పాటు 60 స్థానాలు ఉన్న అసెంబ్లీకీ పోలింగ్ జరుగుతోంది.
Apr 19, 2024, 1:57 pm IST
తమిళనాడు

చెన్నైలో తన ఓటు హక్కును వినియోగించుకున్న హీరోలు సూర్య, కార్తి
Apr 19, 2024, 1:55 pm IST
తమిళనాడు

chiyan Vikram
చెన్నైలో తన ఓటు హక్కును వినియోగించుకున్న హీరో చియాన్ విక్రమ్
Apr 19, 2024, 1:50 pm IST
ఢిల్లీ

మధ్యహ్నం ఒంటిగంట వరకు అత్యధికంగా త్రిపురలో 53.04, అత్యల్పంగా లక్షద్వీప్‌లో 29.91 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు వెల్లడించిన ఈసీ.
Apr 19, 2024, 1:47 pm IST
ఢిల్లీ

మధ్యాహ్నం ఒంటిగంట 102 లోక్‌సభ నియోజకవర్గాల్లో నమదైన పోలింగ్ శాతం వివరాలను వెల్లడించిన కేంద్ర ఎన్నికల కమిషన్.
Apr 19, 2024, 1:08 pm IST
తమిళనాడు

Tamil Nadu polling
ఉదయం 11 గంటలకు లోక్‌సభ నియోజకవర్గాల్లో పోల్ అయిన ఓట్ల శాతం వివరాలను వెల్లడించిన కేంద్ర ఎన్నికల కమిషన్.
Apr 19, 2024, 1:05 pm IST
ఉత్తరాఖండ్

లోక్‌సభ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖ యోగా గురు రామ్‌దేవ్ బాబా. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోగ విముక్త, మాదక ద్రవ్య విముక్త భారత్‌కు తాను ఓటు వేశానని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Apr 19, 2024, 12:27 pm IST
పశ్చిమ బెంగాల్

కూచ్ బిహార్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న కాంగ్రెస్ అభ్యర్థి పియా రాయ్ చౌదరి.
Apr 19, 2024, 12:19 pm IST
తమిళనాడు

Trisha
చెన్నైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న కోలీవుడ్ బ్యూటీ త్రిష.
Apr 19, 2024, 11:56 am IST
నాగాలాండ్

నాగాలాండ్

ఓటుహక్కు వినియోగించుకున్న నాగాలాండ్ మంత్రి తెమ్జీన్ ఇమ్నాఅలాంగ్
Apr 19, 2024, 11:27 am IST
తమిళనాడు

Yogi Babu
చెన్నైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న కమేడియన్ యోగిబాబు దంపతులు.
Apr 19, 2024, 11:15 am IST
మహారాష్ట్ర

నాగ్‌పూర్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకున్న మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఆయన భార్య అమృత ఫడ్నవీస్
Apr 19, 2024, 11:13 am IST
తమిళనాడు

చెన్నైలో తమ ఓటు హక్కును వినియోగించుకున్న డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ దంపతులు.
Apr 19, 2024, 11:07 am IST
మహారాష్ట్ర

Jyoti Amge
30 సంవత్సరాల వయస్సు ఉన్న జ్యోతి ఆమ్గే ఎత్తు 63 సెంటీమీటర్లే. ప్రపంచంలోనే అత్యంత పొట్టి మహిళగా గుర్తింపు పొందారు.
Apr 19, 2024, 11:01 am IST
మహారాష్ట్ర

నాగ్‌పూర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్న పొట్టి మహిళ జ్యోతి ఆమ్గే
Apr 19, 2024, 10:40 am IST
తమిళనాడు

Kamal Hassan
చెన్నై కోయంబేడులోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు ప్రముఖ నటుడు, మక్కల్ నీథి మయ్యం చీఫ్ కమల్ హాసన్. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
Apr 19, 2024, 10:38 am IST
తమిళనాడు

Vijay Sethupathi
చెన్నై కీల్పాక్‌లోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి. ఓటర్లతో పాటు క్యూలో నిల్చుని తనవంతు వచ్చేంత వరకు వెయిట్ చేసి మరీ ఓటు వేశారాయన.
Apr 19, 2024, 10:26 am IST
తమిళనాడు

చెన్నై కోయంబేడులోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేసిన ప్రముఖ నటుడు, మక్కల్ నీథి మయ్యం చీఫ్ కమల్ హాసన్.
READ MORE

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+