LPG Price Hike:ఇది ప్రభుత్వ వైఫల్యమా..లేక అంతర్జాతీయ ఇంధన సంక్షోభమా?
గత కొన్ని వారాలుగా భారత్లో ఎల్పీజీ ధరల పెంపు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. మార్చి 7, 2026న కేంద్ర ప్రభుత్వం గృహ అవసరాల గ్యాస్ సిలిండర్ ధరను రూ.60 పెంచడంతో, విపక్షాలు దీనిని ప్రభుత్వ విధానపరమైన వైఫల్యంగా చిత్రీకరిస్తున్నాయి. అయితే, అంతర్జాతీయ ఇంధన మార్కెట్ మరియు భౌగోళిక రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే, ఈ ధరల పెంపు వెనుక ఉన్న అసలు కారణాలు వేరే ఉన్నాయని స్పష్టమవుతోంది.
పశ్చిమ ఆసియా సంక్షోభం - పెరిగిన గ్లోబల్ రేట్లు
పశ్చిమ ఆసియాలో నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ ఇంధన ధరలు భారీగా పెరిగాయి.దీని ప్రభావంతో ఢిల్లీలో 14.2 కిలోల నాన్-సబ్సిడీ సిలిండర్ ధర రూ.853 నుండి రూ.913కి చేరింది.నిజానికి,ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నష్టపోకుండా ఉండాలంటే ఒక సిలిండర్ ధర రూ.1,050 ఉండాలి.కానీ,సామాన్యులపై భారం పడకుండా ప్రభుత్వం ఇప్పటికీ సిలిండర్కు సుమారు రూ.130 భారాన్ని భరిస్తోంది.

అంతర్జాతీయ ధరలకు.. స్వదేశీ ధరలకు పొంతన లేదు
భారత్ తన ఎల్పీజీ అవసరాల్లో 60 శాతం దిగుమతులపైనే ఆధారపడుతుంది.అంతర్జాతీయంగా 'సౌదీ కాంట్రాక్ట్ ప్రైస్'(Saudi CP)ప్రాతిపదికన ధరలు నిర్ణయించబడతాయి.గత రెండేళ్లలో (జూలై 2023 - నవంబర్ 2025)అంతర్జాతీయ ధరలు 21 శాతం పెరిగాయి.మార్కెట్ సూత్రాల ప్రకారం చూస్తే మన దేశంలో కూడా ధరలు పెరగాలి.కానీ,అదే సమయంలో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల దేశీయంగా గ్యాస్ ధరలు 22 శాతం తగ్గాయి (రూ.1103 నుండి రూ.853కి). అంటే, గ్లోబల్ ధరలు పెరుగుతున్నా ప్రభుత్వం వినియోగదారులకు ఊరటనిస్తూ వచ్చింది.
హోర్ముజ్ జలసంధి - రవాణా అడ్డంకులు
భారత్కు వచ్చే ఎల్పీజీ దిగుమతుల్లో 60 శాతం ' హోర్ముజ్ జలసంధి'(Strait of Hormuz)గుండానే రావాలి.ప్రస్తుత యుద్ధ వాతావరణం వల్ల ఈ మార్గంలో ట్యాంకర్ల రాకపోకలు నెమ్మదించాయి.దీనివల్ల రవాణా ఖర్చులు,ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరిగి అంతర్జాతీయంగా గ్యాస్ ధరలు ఎగబాకాయి.ఇది కేవలం భారత్కు మాత్రమే కాదు,జపాన్,యూరప్ దేశాలకు కూడా పెద్ద సమస్యగా మారింది.
ప్రభుత్వమే భరిస్తున్న అధిక భారం
నవంబర్ 2025 నుండి ఫిబ్రవరి 2026 మధ్య అంతర్జాతీయ ధరల ప్రకారం చూస్తే, దేశీయంగా సిలిండర్ ధర రూ.130 పెరగాలి.కానీ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా ధరలను పెంచకుండా నిలిపివేసింది.మార్చిలో చేసిన సవరణలో కూడా కేవలం రూ.60 మాత్రమే పెంచి,మిగిలిన రూ.70 భారాన్ని ప్రభుత్వమే భరిస్తోంది. అంటే గ్లోబల్ షాక్లో సగానికి పైగా భారాన్ని ప్రభుత్వం తనపై వేసుకుంది.

పక్క దేశాలతో పోలిస్తే మనమే నయం
మార్చి 2026 నాటికి దక్షిణ ఆసియా దేశాల్లో ఎల్పీజీ ధరలను గమనిస్తే భారత్లోనే అతి తక్కువ ధరలు ఉన్నాయని తెలుస్తోంది.
- భారత్ (ఢిల్లీ): రూ.913
- నేపాల్: రూ.1,207
- శ్రీలంక: రూ.1,241
- పాకిస్థాన్: రూ.1,046
సుమారు 30 కోట్ల మంది వినియోగదారులకు గ్యాస్ అందజేస్తున్న భారత్, ఇరుగుపొరుగు దేశాల కంటే మెరుగైన ధరలకే ఇంధనాన్ని సరఫరా చేస్తోంది.

ఉజ్వల లబ్ధిదారులకు పూర్తి రక్షణ
దేశంలోని సుమారు 10.5 కోట్ల పేద కుటుంబాలకు 'ప్రధాన మంత్రి ఉజ్వల యోజన' కింద రక్షణ కల్పిస్తున్నారు. వీరికి సిలిండర్ పై రూ.300 సబ్సిడీ అందుతోంది. దీనివల్ల తాజా ధరల పెంపు తర్వాత కూడా వీరు కేవలం రూ.613 కే సిలిండర్ను పొందుతున్నారు. అంటే దేశంలోని అట్టడుగు వర్గాలపై ఈ ధరల పెంపు ప్రభావం ఏమాత్రం పడలేదు.
తక్కువ ఇంపాక్ట్ - ఎక్కువ చర్చ
ఒక సామాన్య కుటుంబం ఏడాదికి సగటున 4-5 సిలిండర్లు వాడుతుంది. ఈ రూ.60 పెంపును రోజువారీ ఖర్చుగా లెక్కగడితే, ఒక కుటుంబానికి రోజుకు కేవలం 80 పైసలు, అంటే ఒక వ్యక్తికి 20 పైసల భారం మాత్రమే పడుతుంది. ఇది ఒక కప్పు టీ ఖర్చు కంటే చాలా తక్కువ.
1991 నాటి సంక్షోభంతో పోలిక వద్దు
ప్రస్తుత పరిస్థితిని 1991 ఆర్థిక సంక్షోభంతో విపక్షాలు పోలుస్తున్నాయి. కానీ అప్పటికి ఇప్పటికి భూమికి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంది. 1991లో మన విదేశీ మారక నిల్వలు కేవలం 1 బిలియన్ డాలర్లు ఉంటే, ఇప్పుడు అవి 700 బిలియన్ డాలర్లకు పైగా ఉన్నాయి. అలాగే మన దగ్గర అత్యవసర సమయాల కోసం భారీ ఇంధన నిల్వలు (Strategic Reserves) సిద్ధంగా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం నెలకొన్న వేళ,భారత్ తన దేశీయ మార్కెట్ను కాపాడుకోవడానికి పకడ్బందీ వ్యూహాన్ని అనుసరిస్తోంది.కేవలం మధ్యప్రాచ్యంపైనే ఆధారపడకుండా అమెరికా వంటి దేశాల నుండి దిగుమతులను పెంచుకుంటూ ఇంధన భద్రతను పటిష్టం చేస్తోంది.కాబట్టి,ఇప్పుడు జరుగుతున్న ధరల సవరణ అనేది కేవలం అంతర్జాతీయ పరిస్థితులకు అనుగుణంగా చేస్తున్న ఒక నియంత్రిత సర్దుబాటు మాత్రమే తప్ప,అది సంక్షోభం కాదు.
-
హోటల్స్ కు గుడ్ న్యూస్: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కోటా పెంపు -
ఏపీలో గ్యాస్ కొరతపై మంత్రి నాదెండ్ల మనోహర్ క్లారిటీ -
మంగళూరు చేరిన భారీ ఎల్పీజీ షిప్- గ్యాస్ కష్టాలకు చెక్ -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
కొత్త పెన్షన్లు, మహిళలకు కొత్త వరాలు - రైతు భరోసా ఇక నుంచి..!! -
మనసు మార్చుకున్న బాలినేని, నెక్స్ట్ ఇక...!? -
పడింది దెబ్బ: మోత మోగిన పెట్రోల్ ధరలు- లీటర్ కు ఎంత పెరిగిందంటే?














Click it and Unblock the Notifications