వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు: క్లారిటీ ఇచ్చిన తమిళనాడు సీఎం, పన్నీర్ !

ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎం. వెంకయ్యనాయుడికి మద్దతు ఇస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి అన్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎం. వెంకయ్యనాయుడికి మద్దతు ఇస్తామని, అందులో ఎలాంటి సందేహం లేదని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి అన్నారు. తమిళనాడు మంత్రి వర్గం, ఎమ్మెల్యేలతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.

జైల్లో శశికళ 13 రోజులు మాత్రమే: మిగిలిన రోజులు జైలు బయట అపార్ట్ మెంట్ లో జల్సా !జైల్లో శశికళ 13 రోజులు మాత్రమే: మిగిలిన రోజులు జైలు బయట అపార్ట్ మెంట్ లో జల్సా !

అన్నాడీఎంకే (అమ్మ) వర్గంలోని ఎమ్మెల్యేలు అందరూ ఎం. వెంకయ్యనాయుడుకే మద్దతు ఇస్తామని ఇప్పటికే తనకు చెప్పారని అన్నారు. దక్షిణ భారతదేశం నుంచి ఉప రాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు పోటీ చెయ్యడం చాల సంతోషంగా ఉందని తెలిపారు.

M Venkaiah Naidu set be next Vice President of India !

ఇక రాష్ట్రపతిగా భారీ మెజారిటీతో విజయం సాదించిన రాజ్ నాథ్ కోవింద్ కు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి అభినందనలు తెలిపారు. అదే విధంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం సైతం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు అభినందనలు తెలిపారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎం. వెంకయ్యనాయుడికి పన్నీర్ సెల్వం వర్గం మద్దతు ఇవ్వనుంది. ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇచ్చే విషయంలో టీటీవీ దినకరన్ వర్గం ఏ విషయం చెప్పకుండా గోడ మీద దీపం పెట్టింది.

English summary
Tamil Nadu Chief Minister Edappadi K. Palaniswami congratulated Ram Nath Kovind on being elected the next President. Former Chief Minister O. Panneerselvam, the leader of an AIADMK faction, also extended his greetings to Kovind.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X