అమిత్ షాకు షాక్: అన్నం పెట్టినవారు మాయం?, టీఎంసీలోకి!
ఇటీవల భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్షా పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరి ప్రాంతంలో పర్యటించారు. ఆ సమయంలో ఓ స్థానికుడి ఇంట్లో భోజనం చేశారు. అయితే అమిత్షాకు అన్నంపెట్టిన ఆ దంపతులు ఇప్పుడు
కోల్కతా: ఇటీవల భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్షా పశ్చిమ బెంగాల్లోని నక్సల్బరి ప్రాంతంలో పర్యటించారు. ఆ సమయంలో ఓ స్థానికుడి ఇంట్లో భోజనం చేశారు. అయితే అమిత్షాకు అన్నంపెట్టిన ఆ దంపతులు ఇప్పుడు కన్పించడంలేదు. వారు గత రెండు రోజులుగా అదృశ్యమైనట్లు స్థానిక బీజేపీ నేత ఒకరు తెలిపారు.
అమిత్షా తన బెంగాల్ పర్యటనను నక్సల్బరి ప్రాంతం నుంచి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో దక్షిణ కథియాజోట్ గ్రామానికి చెందినరాజు మహాలీ అనే పెయింటర్ ఇంట్లో షా భోజనం చేశారు. నేల మీద కూర్చుని అరిటాకులో అన్నం, పప్పుతో షా భోజనం చేసిన ఫొటో అప్పట్లో వైరల్గా మారింది. అయితే అమిత్షా రాజు కుటుంబాన్ని కలిసిన వారం రోజుల్లో ఆ దంపతులు కన్పించకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది.
రాజు, ఆయన భార్య గీత కనబడటం లేదని తమకు సమాచారం వచ్చిందని బీజేపీ నేత దిలీప్ బరుయ్ మీడియాకు తెలిపారు. దీనిపై వెంటనే స్పందించి.. నక్సల్బరీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
అమిత్షా పర్యటన తర్వాత రాజు కుటుంబం స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నేతల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటోందని దిలీప్ వెల్లడించారు. కాగా, రాజు దంపతులను కిడ్నాప్ చేసి ఉంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
టీఎంసీలో చేరిన రాజు కుటుంబం
ఇది ఇలా ఉంటే.. రాజు కుటుంబం టీఎంసీ పార్టీలో చేరినట్లు వార్తలు వచ్చాయి. మంత్రి గౌతమ్ దేవ్ సమక్షంలో గీత, రాజు దంపతులు