మనసు మార్చుకున్న మహా నాయకుడు, హైకమాండ్ ఏం చెప్పింది, పోతేపోని వదిలేయ్ ?
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తాను రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఈ ప్రకటన రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. శనివారం ముంబాయిలో దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ నేను పరుగెత్తడం లేదు, రాజీనామా చెయ్యడం లేదని, తన మనసు మార్చుకున్నాను అంటూ తన రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం హాట్ టాపిక్ అయ్యింది.
లోక్సభ ఎన్నికల్లో మహరాష్ట్రలో బీజేపీ ఓటమి చవిచూడటంతో తాను రాజీనామా చేస్తానని డీసీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు. దాని తరువాత శుక్రవారం ఢిల్లీలో పర్యటించారు. బీజేపీ సీనియర్ నేత అమిత్ షాతో దేవేంద్ర ఫడ్నవీస్ చర్చలు జరిపారు. ఈ భేటీ అనంతరం దేవేంద్ర ఫడ్నవీస్ తన రాజీనామాను ఉపసంహరించుకునే విషయమై మాట్లాడారు. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిందని ఫడ్నవీస్ అన్నారు.

మహారాష్ట్రలో 48 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. కాంగ్రెస్ 13 సీట్లు, బీజేపీ 9 సీట్లు, శివసేన (ఠాక్రే వర్గం) 9 సీట్లు గెలుచుకున్నాయి. మహారాష్ట్ర బీజేపీ యూనిట్ అధ్యక్షుడు చంద్రశేఖర బవాన్కులే. అయితే దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నందున లోక్సభ ఎన్నికల ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని చెప్పారు. మహారాష్ట్ర రాష్ట్రంలో పార్టీని నేనే ముందుండి నడిపిస్తున్నానని అన్నారు.
అలాంటి ఫలితానికి నేనే పూర్తి బాధ్యత వహిస్తానని, నన్ను అన్ని ప్రభుత్వ బాధ్యతల నుంచి తప్పించాలని పార్టీ హైకమాండ్ని కోరుతానని ఫడ్నవీస్ ఇటీవల మీడియాతో అన్నాను.. అప్పుడే వచ్చే ఎన్నికల కోసం పార్టీ పనిని పట్టుదలతో చేసేందుకు నాకు సౌకర్యంగా ఉంటుందని, అందుకే తన డీసీఎం పదవికి రాజీనామా చేస్తానని ఫడ్నవీస్ చెప్పారు. అయితే ఢిల్లీ పర్యటనలో అమిత్ షా మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం కొనసాగాలని, నువ్వు డీసీఎంగా ఉండాలని ఫడ్నవీస్ కు సూచించారని వెలుగు చూసింది.

తనను మహారాష్ట్ర ప్రభుత్వంలో కొనసాగాలని అమిత్ షా సలహా ఇచ్చారని, అందుకే తన రాజీనామాను ఉపసంహరించుకుంటానని దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాకు చెప్పారు. రాష్ట్రంలో మేం కోరుకున్నన్ని సీట్లు సాధించలేకపోయామని.. కానీ మహారాష్ట్రలో మాత్రం భవిష్యత్తు వ్యూహాన్ని రూపొందించుకునేందుకు ఓ సభ నిర్వహించబోతున్నామని, రాష్ట్ర ఎన్నికలకు స్పష్టమైన దిక్సూచి ఉందని ఫడ్నవీస్ అన్నారు.
ఈ లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి నేనే నాయకత్వం వహించాను, అందుకే ఈ ఓటమికి నేనే కారణమని చెప్పాను. నన్ను ఆ సీటు వదిలేసేందుకు అనుమతించాలని నేతలను కోరాను. నేతలకు నాపై నమ్మకం ఉంది. భావోద్వేగంతో నేనేమీ నిర్ణయం తీసుకోలేదు. అని ఫడ్నవీస్ అన్నారు. దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా కొనసాగుతారని, అందులో ఎలాంటి అనుమానం లేదని బీజేపీ నాయకులు అంటున్నారు.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications