మహా ఎన్నికల వేళ షిండే సర్కార్ భారీ ప్లాన్-15 లక్షల ఓబీసీలకు లబ్ది..!
ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా ఓటర్లను బుజ్జగించేందుకు షిండే సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే లోక్ సభ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బల నేపథ్యంలో సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీ-శివసేన-ఎన్సీపీ కూటమి ప్రభుత్వం ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 15 లక్షల మందికి లబ్ది చేకూరబోతోంది.
రాష్ట్రంలో ఓబీసీలకు ప్రస్తుతం రిజర్వేషన్లు పొందేందుకు అమల్లో ఉన్న 8 లక్షల ఆదాయ పరిమితిని 15 లక్షలకు పెంచేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపాలని నిన్న సమావేశమైన మహారాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నాన్-క్రీమీలేయర్ ఆదాయ పరిమితి పెంపు కోసం ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. తద్వారా రిజర్వేషన్ల ఫలాలు మరింత ఎక్కువ మందికి అందుతాయని ప్రభుత్వం చెబుతోంది.

రాష్ట్రంలో భారీ ఎత్తున్న ఉన్న ఓబీసీలకు పూర్తిగా రిజర్వేషన్ల ఫలాలు అందించడం వీలు కావడం లేదు. దీనికి ప్రధాన కారణం నాన్-క్రీమీలేయర్ ఆదాయ పరిమితే. అందుకే మరింత ఎక్కువ మందికి రిజర్వేషన్ల ప్రయోజనం కల్పించేందుకు వీలుగా ఈ పరిమితి పెంచేలా కేంద్రానికి ప్రతిపాదనలు చేయబోతోంది. అయితే కేంద్రం దీన్ని ఆమోదిస్తే ఇతర రాష్ట్రాలు కూడా ఇదే డిమాండ్ ను తెరపైకి తెచ్చే ప్రమాదం పొంచి ఉంది. దీంతో కేంద్రం తీసుకోబోయే నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications