హృతిక్ డ్యాన్స్ అద్భుతం... షారుఖ్, గంభీర్లకు మమతా అభినందనలు
కోల్కత్తా: బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్కు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అభినందనలు తెలిపారు. షారుఖ్ యజమానిగా ఉన్న కోల్కత్తా నైట్ రైడర్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-8లో ఆడిన తొలి మ్యాచ్లో విజయం సాధించడం పట్ల ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు.

కోల్కత్తా నైట్ రైడర్స్ జట్టు కెప్టెన్ గౌతం గంభీర్కు కూడా ఆమె అభినందనలు తెలిపారు. మంచి శుభారంభం, ఇలాగే కొనసాగించండి అంటూ ఆమె తన ట్విట్టర్లో ట్వీట్ చేశారు.
Congratulations to @iamsrk, @GautamGambhir and @KKRiders for the great win in the opening match. Very good start. Keep it up
— Mamata Banerjee (@MamataOfficial) April 9, 2015 ఐపీఎల్ తొలి మ్యాచ్లో ఢిపెండింగ్ ఛాంపియన్స్గా బరిలోకి దిగిన కోల్కత్తా నైట్ రైడర్స్ ఈడెన్ గార్డెన్స్లో ముంబై ఇండియన్స్పై జరిగిన మ్యాచ్లో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఐపీఎల్ ప్రారంభోత్సవానికి హాజరు కాలేకపోయిన మమతా బెనర్జీ, హృతిక్ రోషన్ చేసిన నృత్యాలను టీవీలో చూశానని, అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.
My dear @iHrithik you asked me to watch your performance at #IPL8 ceremony. I watched the repeat on TV. Excellent and full of energy
— Mamata Banerjee (@MamataOfficial) April 9, 2015 ఐపీఎల్ ప్రారంభోత్సం రోజున బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ కళ్లు చెదిరే ప్రదర్శనతో కార్యక్రమం ముగిసిన విషయం తెలిసిందే. తన తొలి సినిమా ‘కహోనా ప్యార్ హై'తో మొదలెట్టి ధూమ్ మచాలే పాటలకు డాన్స్ చేసి ప్రేక్షకులను అలరించాడు.
అనంతరం సైఫ్ ఆలీఖాన్ ఐపీఎల్-8 ప్రారంభమైనట్లు లాంఛనంగా ప్రకటించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 8వ ఎడిషన్లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. 47 రోజుల పాటు జరగనున్న ఈ టోర్నమెంట్లో మొత్తం 60 మ్యాచ్లు నిర్వహించనున్నారు. ఈ ఐపీఎల్ టోర్నీ 47 రోజుల పాటు జరగనుంది.
-
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!!












Click it and Unblock the Notifications