మమతా బెనర్జీకి హైకోర్టు ఝలక్ .. జస్టిస్ కౌశిక్ చందాపై మమత ఆరోపణలు, దీదీకి 5 లక్షల జరిమానా !!
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కి కలకత్తా హైకోర్టు బుధవారం ఐదు లక్షల రూపాయల జరిమానా విధించింది. భారతీయ జనతా పార్టీ (బిజెపి) తో జస్టిస్ కౌశిక్ చందాకి ఉన్న సంబంధాలపై ఆరోపిస్తూ తన నందిగ్రామ్ ఎన్నికల పిటిషన్ విచారణ నుండి ఆయనను జడ్జ్ గా తొలగించాలన్నారు మమతా బెనర్జీ. ఈ కారణంగా కలకత్తా హైకోర్టు బుధవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఐదు లక్షల రూపాయల జరిమానా విధించింది.
తృణమూల్ కాంగ్రెస్ (టిఎంసి) అధినేత్రి మమతా బెనర్జీ దరఖాస్తును జస్టిస్ చందా స్వయంగా తిరస్కరించారు. అయినప్పటికీ, అతను తన వ్యక్తిగత అభీష్టానుసారం కేసు నుండి వైదొలగాలని నిర్ణయించుకున్నాడు. కేసును తన బెంచ్ విచారించకుండా, ఇతర బెంచ్ కు మార్చాలని సూచించారు.న్యాయవ్యవస్థపై దురుద్దేశాలు ఆపాదించినందుకు మమతా బెనర్జీ రూ. 5 లక్షల జరిమానాను ఎదుర్కొంటున్నారని కోర్టు ఉత్తర్వులలో పేర్కొంది. పశ్చిమ బెంగాల్ సిఎం జరిమానా చెల్లించిన మొత్తాన్ని కోవిడ్ -19 బాధిత న్యాయవాదుల కుటుంబాలకు ఉపయోగిస్తామని కలకత్తా హైకోర్టు తెలిపింది.

మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలపై జస్టిస్ కౌశిక్ చందా తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ తాను కేసు నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటువంటి అనవసరమైన ఆరోపణలు కొనసాగితే అది న్యాయ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంటుందని ఆయన కేసు నుండి వైదొలిగేటప్పుడు వెల్లడించారు. అంతకుముందు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్ కు ఒక లేఖ పంపారు, జస్టిస్ చందా పక్షపాత ధోరణి పై శాశ్వత న్యాయమూర్తిగా నియమించడాన్ని ఆమె అభ్యంతరం వ్యక్తం చేస్తూ, బిజెపితో ఆయనకు ఉన్న అనుబంధాన్ని ఉదహరిస్తూ తీవ్ర ఆరోపణలు చేశారు.
అందుకే కలకత్తా హై కోర్టు మమతా బెనర్జీకి 5 లక్షల రూపాయల జరిమానా విధిస్తూ ఝలక్ ఇచ్చింది.












Click it and Unblock the Notifications