మేనల్లుడిని సీఎం చేయడమే లక్ష్యం.. దీదీపై అమిత్ షా ఫైర్
బెంగాల్ ఎన్నికలు కాక రేపుతున్నాయి. రెండు విడతలు జరగగా మరో 6 విడతల పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే సీఎం మమతా బెనర్జీపై అమిత్ షా ఫైరయ్యారు. బెంగాల్ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. రెండుసార్లు సీఎంగా మమత చేసిన సంక్షేమం పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడు ఆమెను ఇంటికి పంపించాలని భావిస్తున్నారని చెప్పారు. బెంగాల్లో ఇక మమత శకం ముగిసినట్టేనని చెప్పారు.

ఈ సారి మమత పాలనను పట్టించుకోలేదని అమిత్ షా అన్నారు. తన మేనల్లుడు అభిషేక్ బెనర్జీని తదుపరి సీఎం చేయడంపైనే ఫోకస్ చేశారని ఆరోపించారు. దీనిని ప్రజలు గమనించారని.. ఆమెకు బుద్ది చెప్పాలని భావించారని తెలిపారు. అందుకోసమే ఈ సారి భాదానిపూర్ నుంచి కాకుండా నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగారని చెప్పారు. సిట్టింగ్ స్థానం నుంచి పారిపోయి.. మరో చోట పోటీకి దిగారని వివరించారు.
మమతా ఎక్కడనుంచి పోటీచేసినా పర్లేదు అని అమిత్ షా చెప్పారు. కానీ ఆమె ఓడిపోవడం మాత్రం ఖాయం అని చెప్పారు. నందిగ్రామ్లో బీజేపీ గెలుస్తోందని.. మమతాపై సువేందు 20 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తారని చెప్పారు. రెండు విడతల్లో కలిసి బీజేపీ 50 నుంచి 60 సీట్లు గెలుస్తోందని చెప్పారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications