వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ నీచమైన వ్యక్తి.. మరోసారి అయ్యర్ ఫైర్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోడీపై మరోసారి విరుచుకుపడ్డారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ మణిశంకర్ అయ్యర్. మోడీని ఉద్దేశిస్తూ నీచమైన వ్యక్తిగా గతంలో అభివర్ణించిన అయ్యర్ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. మోడీపై తాను మాట్లాడిన తీరును భవిష్యవాణితో పోల్చారు. ఈ నెల 23వ తేదీన ఆయన గద్దె దిగడం ఖాయమంటూ సెటైర్లు వేశారు.

నల్గొండలో మరో సైకో శీనుగాడు.. మైనర్ బాలికపై రేప్.. శీలానికి రేటు..!నల్గొండలో మరో సైకో శీనుగాడు.. మైనర్ బాలికపై రేప్.. శీలానికి రేటు..!

మోడీ నోరు దుర్భరమైంద‌ని ఎద్దేవా చేసిన అయ్యర్.. ఆయన హవా తగ్గిపోయిందని వ్యాఖ్యానించారు. కేంద్రంలో ఈసారి బీజేపీ ప్రభుత్వం రావడం కష్టమేనంటూ చెప్పుకొచ్చారు. అయితే అప్పుడెప్పుడో 2017లో మోడీపై ఆరోపణలు గుప్పించిన అయ్యర్.. తాజాగా మరోసారి ఫైరయ్యారు. ఆనాడు మోడీని నీచుడిగా అభివర్ణిస్తూ తాను చేసిన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. రైజింగ్ కశ్మీర్ అనే వెబ్ సైట్ కు రాసిన వార్తా కథనంలో ఈ విధంగా స్పందించారు.

 Mani Shankar Aiyar justifies his neech aadmi jibe against PM Modi

అదలావుంటే మోడీపై చేసిన వ్యాఖ్యలను మణిశంకర్ అయ్యర్ సమర్థించుకుంటున్న నేపథ్యంలో బీజేపీ నేతలు రంగంలోకి దిగారు. ఆయన తీరు సరికాదంటూ.. అయ్యార్ మళ్లీ వచ్చాడంటూ బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నర్సింహారావు ఎద్దేవా చేశారు. మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేసి ఆనాడు తప్పు ఒప్పుకుని క్షమాపణలు చెప్పిన అయ్యర్.. మళ్లీ ఇప్పుడు అదే ధోరణిలో మాట్లాడటం తగదంటూ హితవు పలికారు.

English summary
Congress leader Mani Shankar Aiyar on Tuesday justified his ‘neech aadmi’ remark against Prime Minister Modi, calling it “prophetic”. Aiyar was suspended from Congress’ primary membership following his jibe against the PM in December 2017.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X