చిందేసిన కేంద్రమంత్రులు స్మృతి, హర్ సిమ్రాత్ కౌర్
చండీగఢ్: నిత్యం రాజకీయాలతో, అధికారులతో సమావేశాలతో బిజీగా గడిపే మహిళా కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, హర్ సిమ్రాత్ కౌర్ బాదల్.. సరదాగా కాసేపు నాట్యం చేశారు. తాము మంత్రులమనే హోదాను కాసేపు వారు పక్కన పెట్టి.. ఆనందంగా డ్యాన్స్ చేశారు.

జానపద పాటలకు సరదాగా చిందేశారు. పంజాబ్ లోని ఓ కళాశాల కార్యక్రమంలో వీరిద్దరు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి స్టెప్లులేశారు.
పంజాబ్ రాష్ట్రలోని బతీంద్ర జిల్లాలో బతీంద్ర కేంద్ర విశ్వవిద్యాలయంలో కేంద్రమంత్రి స్మృతి ఇరానీ మంగళవారం నాడు కొత్త క్యాంపస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు విద్యార్థినీలతో కలిసి నాట్యం చేసి అలరించారు. వారు నవ్వుతూ చిందేశారు.












Click it and Unblock the Notifications