అదృశ్యమైన టిసిఎస్ టెక్కీ శవమై తేలాడు
చెన్నై: తురైపక్కమ్ నుంచి అదృశ్యమైన 31 ఏళ్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్ శవమై తేలాడు. అతని శవం శనివారంనాడు కోవలం, మహాబలిపురం మధ్య గల పొలాల్లో కనిపించింది. అతన్ని హత్య చేశారని భావిస్తున్నారు.
తెర్కుపేట్ గ్రామస్థులు బకింగ్హామ్ కెనాల్కు ఆనుకుని ఉన్న చిత్తడి భూమిలో అతని శవాన్ని చూసి మహాబలిపురం పోలీసులకు సమాచారం అందించారు. అతని శవాన్ని చెంగల్పేట్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మృతుడిని వి కార్తికేయన్ (31)గా గుర్తించారు అతను తురైపక్కమ్లోని టిసిఎస్లో పనిచేస్తున్నాడు. అతను కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యుల ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అతన్ని గుర్తించారు. పాత మహాబలిపురం ఐటి కారిడార్ వైపు ఉంటూ వచ్చిన కార్తికేయన్ నవంబర్ 2వ తేదీన తురైపక్కమ్ పురుషుల పేయింగ్ గెస్ట్ హౌస్లోకి మారాడు.
సాయంత్రం వేళ తల్లితో కలిసి అతను గృహప్రవేశం చేయాల్సి ఉండింది. అతని తల్లి పక్కవాళ్లింట్లో ఉంచి అడ్వాన్స్ డబ్బుల కోసమని బయటకు వెళ్లి కార్తికేయన్ తిరిగి రాలేదు. ఏదో వస్తువుతో ముఖాన్ని ధ్వంసం చేసిన ఆనవాళ్లున్నాయి. కన్ను చిట్లిపోయింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications