ఎమ్మెల్సీ ఎన్నికల నగారా.. షెడ్యూల్ విడుదల
ఢిల్లీ : తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ పట్టభద్రుల నియోజకవర్గం.. నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు చేశారు అధికారులు. సోమవారం నాడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల కానుంది.
అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి మార్చి 5వ తేదీని తుది గడువుగా విధించారు. మార్చి 6వ తేదీన నామినేషన్లు పరిశీలించనున్నారు. ఉపసంహరణకు 8వ తేదీని గడువుగా నిర్ణయించారు.

మార్చి 22వ తేదీన ఉదయం 8 గం. నుంచి సాయంత్రం 4 గం. వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ తర్వాత 4 రోజులకు అంటే మార్చి 26వ తేదీన ఫలితాలు రిలీజ్ చేయనున్నారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications