వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీ-ట్రంప్: 22 కిలోమీటర్ల రోడ్ షో: ఎర్ర తివాచీ..నల్ల కార్లు: మోడీ ఒక్కరే: ఎందుకంటే..!

|
Google Oneindia TeluguNews

అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన కొద్దిసేపటి కిందటే ఆరంభమైంది. డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియా ట్రంప్, కుమార్తె ఇవాంకా ట్రంప్, కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌తో కలిసి ఈ ఉదయం 11:55 నిమిషాలకు అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక్కరే ట్రంప్ కుటుంబానికి స్వాగతం పలికారు. సాదరంగా ఆహ్వానించారు.

Recommended Video

Namaste Trump : World's Two Most Powerful Persons In Ahemadabad | Oneindia Telugu

భారత గడ్డపై అడుగు పెట్టబోతూ: ఎయిర్‌ఫోర్స్ వన్ నుంచే.. హిందీలో ట్వీటిన ట్రంప్..!భారత గడ్డపై అడుగు పెట్టబోతూ: ఎయిర్‌ఫోర్స్ వన్ నుంచే.. హిందీలో ట్వీటిన ట్రంప్..!

గుజరాత్ గవర్నర్ గానీ ముఖ్యమంత్రి విజయ్ రుపాణీ గానీ, ఆయన మంత్రి వర్గ సహచరులు గానీ, అహ్మదాబాద్ నగర్ ప్రథమ పౌరుడు గానీ ఎవరూ ట్రంప్‌కు ఆహ్వానం పలకడానికి విమానాశ్రయానికి చేరుకోలేదు. ప్రొటోకాల్ ప్రకారం.. గవర్నర్‌కు ఆ అవకాశాన్ని ఇవ్వాల్సి ఉన్నప్పటికీ ఆయన విమానాశ్రయానికి రాలేదు. వారంతా నమస్తే ట్రంప్ కార్యక్రమానికి వేదికగా మారిన మొతేరా స్టేడియం వద్ద ట్రంప్‌కు స్వాగతం పలికే అవకాశం ఉంది.

Modi greets Donald Trump, First Lady Melania at Ahmedabad airport

ఈ సందర్భంగా విమానాశ్రయంలో అధికారులు ట్రంప్ కుటుంబ సభ్యులకు ఎర్ర తివాచీ స్వాగత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పరిచయ కార్యక్రమాలు ముగిసిన అనంతరం అక్కడే అందుబాటులో ఉంచిన కాన్వాయ్‌ ద్వారా సబర్మతి ఆశ్రమం వైపునకు బయలుదేరి వెళ్లారు. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం మధ్య దూరం సుమారు 22 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 22 కిలోమీటర్ల పొడవునా ట్రంప్ కుటుంబానికి ఘనంగా స్వాగత కార్యక్రమాలను ఏర్పాటు చేశారు అధికారులు.

గుజరాతీ సంప్రదాయ నృత్యాలు, మల్లఖంబా వంటి ప్రదర్శనలను నిర్వహిస్తున్నారు. దారి పొడవునా కూడా వేలాది మంది గుజరాతీయులు భారత్, అమెరియా జాతీయ పతాకాలను చేత పట్టుకుని రోడ్డుకు ఇరు వైపులా నిల్చున్నారు. కాన్వాయ్‌కు స్వాగతం పలికారు. గంట పాటు ఈ రోడ్ షో కొనసాగుతుంది. అనంతరం మొతేరా స్టేడియంలో ఏర్పాటు చేసిన నమస్తే ట్రంప్ కార్యక్రమంలోొ వారంతా హాజరవుతారు.

English summary
US President Donald Trump, along with First Lady Melania Trump arrived in Ahmedabad on Monday on his maiden visit to India. In Ahmedabad, the US President will address the 'Namastey Trump' event at the Motera stadium along with Prime Minister Narendra Modi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X