జర్నలిస్టుల ప్రాణాలు కాపాడిన ప్రధాని మోడీ!
గాంధీనగర్: ప్రధాని నరేంద్ర మోడీ సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పలువురు మీడియా ప్రతినిధులు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ విషయాన్ని గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ స్వయంగా వెల్లడించారు.
మంగళవారం గుజరాత్ పర్యటనలో భాగంగా మోడీ ఓ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. జామ్నగర్లో మీట నొక్కి డ్యామ్ నుంచి నీటిని విడుదల చేసిన తర్వాత అక్కడి ప్రకృతిని చూస్తూ మోడీ నిల్చున్నారు.

అయితే అప్పటికే డ్యామ్కి కాస్త దూరంలో కింద నిలబడి ఫొటోలు తీస్తున్న జర్నలిస్ట్లు వేగంగా వస్తున్న నీటి ప్రవాహాన్ని గమనించలేదు. ఆ ఫొటోగ్రాఫర్లను గమనించిన మోడీ చప్పట్లు కొడుతూ, చేతులు ఊపుతూ వారిని అప్రమత్తం చేశారు.
దీంతో సమయానికి వాళ్లు అక్కడి నుంచి తప్పుకున్నారు. ప్రధాని సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని నితిన్ పటేల్ తెలిపారు. గతంలో ప్రధాని మోడీ.. ఓ రిపోర్టర్ కిందపడిపోతుండగా పట్టుకుని పైకి లేపిన విషయం తెలిసిందే.
-
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!! -
అదే గానీ జరిగితే.. పాకిస్థాన్కు రాజ్నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్.. -
వివాహేతర సంబంధాల్లో రెండో స్థానంలో హైదరాబాద్.. తాజా సర్వేలో.. -
వాస్తు ప్రకారం.. ఇంట్లో ఈ మొక్కలు పెరుగుతూ ఉంటే సంపద పెరుగుతూ ఉంటుంది












Click it and Unblock the Notifications