ఓడలో నరక యాతన- 2 వేల మంది ప్రయాణికుల మధ్య 66 కోవిడ్ రోగులు- అటూ ఇటూ తిరుగుతూ
ముంబై-గోవా సముద్ర తీరంలో ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. గోవా నుంచి ముంబై వెళ్తున్న కార్డిలియా క్రూయిజ్ నౌకలో 66 మంది కోవిడ్ రోగులు ఉన్నారన్న సమాచారంతో మిగతా ప్రయాణికులందరికీ చుక్కలు కనిపిస్తున్నాయి. వీరిని అందులో నుంచి బయటకు పంపాలంటూ మిగతా ప్రయాణికులు ఆందోళనకు దిగారు. కానీ నౌక సముద్రం మధ్యలో ఉండటంతో ఈ రోగుల్ని అక్కడి నుంచి బయటకు పంపలేని పరిస్ధితి.

క్రూయిజ్ నౌకలో కోవిడ్ రోగులు
గోవా నుంచి ముంబైకు నిన్న ఓ క్రూయిజ్ నౌక బయలుదేరింది. దాని పేరు కార్డిలియా. గోవా తీరంలో ఎప్పటిలాగే అది ప్రయాణికుల్ని ఎక్కించుకుని బయలుదేరింది. మొత్తం 2 వేల మంది ప్రయాణికులు ఇందులో ఎక్కారు. అయితే అంతకముందే నిర్వహించిన కోవిడ్ పరీక్షల్లో అందులో ప్రయాణిస్తున్న 66 మందికి కోవిడ్ ఉన్నట్లు తేలింది. నౌక గోవా తీరం నుంచి బయలుదేరిన తర్వాత ఈ విషయం తెలిసింది. దీంతో ఒక్కసారిగా కలకలం మొదలైంది. తమ చుట్టూ కోవిడ్ రోగులు ఉన్నారని తెలిసి మిగతా వారికి కంటిమీద నిద్ర కరువైంది.

కోవిడ్ రోగుల సంచారం
కార్డిలియా క్రూయిజ్ నౌకలో ప్రయాణిస్తున్న వారిలో 66 మందికి కరోనా సోకినట్లు గుర్తించిన మిగతా ప్రయాణికులకు కంటిమీద కునుకు లేదు. దీనికి తోడు సదరు కోవిడ్ రోగులు నౌక లాబీల్లో సంచరిస్తుండటంతో ఇక మిగతా వారి భయాలకు అంతులేకుండా పోతోంది. లాబీల్లో వీరు తిరుగుతుండటం వల్ల తమ కుటుంబసభ్యులకు, పిల్లలకు ఎక్కడ కరోనా సోకుతుందో అని మిగతా ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. తక్షణం వీరినైనా బయటికి పంపాలని, లేదా తమనైనా బయటికి తీసుకురావాలని వారు కోరుతున్నారు.

బయటికెళ్లేందుకు నో ఛాన్స్
కార్డిలియా క్రూయిజ్ నౌకలో 66 మంది కోవిడ్ రోగులు ఉన్నట్లు తేలినా అధికారులు జోక్యం చేసుకుని వారిని బయటకు పంపేందుకు ప్రయత్నించకపోవడంపై మిగతా ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిని బయటకు పంపకపోతే కనీసం తమనైనా నౌక నుంచి బయటకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అయితే సముద్రంలో ప్రయాణం సాగిస్తుండటంతో వీరిని నౌక నుంచి బయటకు పంపేందుకు అవకాశం లేకుండాపోతోంది. దీంతో వీరి ఆందోళన మరింత పెరుగుతోంది.

విమర్శల వెల్లువ
గోవా అధికారులు నౌక బయలుదేరే ముందు కోవిడ్ పరీక్షలు నిర్వహించి పాజిటివ్ గా తేలిన వారిని క్రూయిజ్ లోకి అనుమతించకుండా ఉండాల్సిందన్న వాదన వినిపిస్తోంది. వీరిని నెగెటి్వ్ గా తేలిన వారితో కలిపి ఎలా పంపుతారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. ఇది గోవా అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు నౌకలో ఉన్న తమ కుటుంబాలు, పిల్లలకు వైరస్ సోకితే ఎవరు బాధ్యత వహిస్తారని వారు నిలదీస్తున్నారు. దీంతో అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఏమీ చేయలేని పరిస్ధితి.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications