అవమానించారంటూ... విమానం దిగని ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్... 45ని" ఆలస్యం..!!
వివాదస్పద భోపాల్ బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ తాను ప్రయాణిస్తున్న విమానంలో నుండి దిగనంటూ ఎయిర్పోర్టు అధికారులకు చమటలు పట్టించారు. తానో ఎంపీ అని కూడ చూడకుండా విమాన సిబ్బంది అవమానపరిచారంటూ ఆ విమాన సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు నిరసగానే గమ్యస్థానానికి చేరుకున్న విమానం నుండి ఉన్నతాధికారులు వచ్చే వరకు దిగకుండా సిబ్బందికి ముచ్చెమటలు పట్టించారు. ఆమె నిరసనతో వెళ్లాల్సిన ఫ్లైట్ 45 నిమిషాల పాటు ఆలస్యంగా బయలుదేరింది.
ఈ నేపథ్యంలోనే ఎంపీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ ఆదివారం ఢిల్లీ నుండి భోపాల్కు ఓ ప్రముఖ స్పైస్జెట్ ఎయిర్లైన్స్లో బయలుదేరింది. అయితే ప్రయాణ సమయంలో సదరు విమాన సంస్థ సిబ్బంది దురుసుగా వ్యవహరించారని , తాను బుక్చేసుకున్న సీటును తనకు కేటాయించలేదని ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు.

దీంతో విమానం బోపాల్లో విమానం ల్యాండ్ అయిన తర్వాత విమానం దిగడానికి చాలసేపు నిరాకరించారు. దీంతో సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. దీంతో ఆమెను ఇబ్బందిపెట్టిన సిబ్బందిపై చర్యలు చేపడతామని , హమి ఇవ్వడంతో ఆమె మెత్తబడ్డారు. దీంతో వారికి జరిగిన సంఘటపై ఫిర్యాదు చేసి వెళ్లి పోయారు. కాగా ఎంపీ ఫిర్యాదును పరీశీలించి విచారణ చేపడతామని అధికారులు తెలిపారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications