ముఖేష్ అంబానీ కేసులో షాకింగ్ ట్విస్ట్ .. ఇంటి దగ్గర సీసీ టీవీ ఫుటేజ్ మాయం చేసిన పోలీస్ అధికారి సచిన్ వాజే
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ ఇంటికి సమీపంలో స్కార్పియో వాహనంలో జెలటిన్ స్టిక్స్ పెట్టి , ముకేశ్ అంబానీ కుటుంబానికి బెదిరింపు లేఖ రాసిన కేసు దర్యాప్తు రోజుకో కొత్త మలుపు తిరుగుతుంది. అంబానీ బెదిరింపుల కేసులో అనుమానితుడిగా అరెస్ట్ అయిన ముంబై పోలీస్ అధికారి సచిన్ వాజే ను కోర్టు ఈ నెల మార్చి 25 వరకు ఎన్ఐఏ కస్టడీకి అప్పగించింది.

ముఖేష్ అంబానీకి బాంబు బెదిరింపు కేసులో కొత్త మలుపు
ఈ కేసులో మొదటి స్కార్పియో వాహనం యజమాన గా భావించిన మన్సుఖ్ హిరెన్ ను ప్రశ్నించిన పోలీసులు ఆవాహనం దొంగలించబడిందని వెల్లడించారు. ఆ తర్వాత ఈ కేసులో కీలక సాక్ష్యంగా భావిస్తున్న హిరెన్ హత్యకు గురికావడంతో కేసు మరో మలుపు తీసుకుంది. ఈ కేసు దర్యాప్తును ఎన్ఐఏకి బదిలీ చేసింది ప్రభుత్వం. ఇక హిరెన్ భార్య ఆ స్కార్పియో వాహనాన్ని ముంబై పోలీసు అధికారి సచిన్ వాజే నాలుగు నెలల పాటు వాడుకున్నాడని చెప్పడంతో కేసులో కొత్త కోణాలు వెలుగుచూశాయి.

సీసీ టీవీ ఫుటేజ్ తొలగింపు .. స్కార్పియో వాహనాన్ని ఉపయోగించిన సచిన్ వాజే ?
మొదట ముఖేష్ అంబానీ కి బాంబు బెదిరింపు కేసులో మొదటి దర్యాప్తు అధికారి గా వ్యవహరించింది , ఆ వాహనాన్ని వినియోగించారని చెప్పబడుతున్న పోలీస్ అధికారి సచిన్ వాజే కావడంతో వెంటనే అతనిని బదిలీ చేసింది ప్రభుత్వం. తాజాగా సస్పెన్షన్ వేటు వేసింది. అతనిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు ఎన్ఐఏ అధికారులు.
అయితే సచిన్ వాజే ఆ స్కార్పియో ఉపయోగించారా లేదా అనేది తెలుసుకోవడం కోసం ప్రయత్నిస్తున్న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సిసి టివి ఫుటేజ్ లభించకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేస్తుంది.

సిఐయూ అధికారిగా ఉన్నప్పుడే సచిన్ వాజే సీసీ టీవీ ఫుటేజ్ స్వాధీనం
ఈ కేసు విషయంలో తన ప్రమేయాన్ని దర్యాప్తు చేస్తున్న క్రమంలో సచిన్ వాజే నివాసముంటున్న హౌసింగ్ సొసైటీ యొక్క డిజిటల్ వీడియో రికార్డర్ ను ఇంటిలిజెన్స్ ఏజెన్సీలో నాడు అధికారిగా ఉన్న సచిన్ వాజే స్వాధీనం చేసుకున్నారు. ఇక అరెస్ట్ చేసిన తర్వాత ఎన్ఐ ఏ డిజిటల్ వీడియో రికార్డ్ నుండి వచ్చిన సిసి టివి ఫుటేజ్ లో ఏమీ లేకపోవడంతో ఈ కేసులో మరింత ఆసక్తి చోటుచేసుకుంది .
మొదట ఆరోపణలు ఎదుర్కొన్న సచిన్ వాజే ను సిఐయు నుండి ముంబై పోలీసు ప్రధాన కార్యాలయంలోని సిటిజెన్ ఫెసిలిటేషన్ సెంటర్కు బదిలీ చేశారు.

ఆధారాలు దొరక్కుండా ఇదంతా చేశారా ? సిఐయూ అధికారులను విచారిస్తున్న ఎన్ఐఏ
ఆ తర్వాత కొద్ది రోజులకు సచిన్ వాజేను ఎన్ఐఏ అరెస్టు చేసింది. నిన్న ఆయనను సర్వీసు నుంచి సస్పెండ్ చేశారు.
సచిన్ వాజే తన సొంత రెసిడెన్షియల్ సొసైటీ యొక్క డివిఆర్ మరియు సిసిటివి ఫుటేజ్లను ఎందుకు స్వాధీనం చేసుకున్నారన్న దానిపై ఎన్ఐఏ ఇప్పుడు ఆసక్తిగా ఉంది. దర్యాప్తులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాన్ని సందర్శించినప్పుడు ఈ విషయం వెలుగులోకి వచ్చింది. మన్సుఖ్ హిరేన్తో తన సంబంధాలు బహిర్గతం అయిన తర్వాత అతనిపై ఏవైనా ఆధారాలు దొరకకుండా ఉండడం కోసం సచిన్ వాజే ఈ పని చేసి ఉండవచ్చని ఎన్ఐఏ అనుమానిస్తుంది. సిసి టివి ఫుటేజ్ తొలగింపుకు సంబంధించి సిఐయు అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ రియాజ్ కాజీని కూడా ఏజెన్సీ ప్రశ్నిస్తోంది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications