శివథాను పిళ్లైకి లాల్బహదూర్ శాస్త్రి అవార్డు (ఫోటోలు)
న్యూఢిల్లీ: ప్రముఖ రక్షణ పరిశోధకుడు, బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి పితామహుడు శివధాను పిళ్లై లాల్ బహుదూర్ శాస్త్రి జాతీయ అవార్డు అందుకున్నారు. మంగళవారం రాష్టప్రతి భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో పిళ్లైకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అవార్డును అందజేశారు. అంతరిక్ష పరిశోధనలు, మిస్సైల్ టెక్నాలజీ అభివృద్ధిలో పిళ్లై చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.
ఈ అవార్డు కింద రూ. 5 లక్షలు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక లభించాయి. ఈ సందర్బంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ ‘నేను వ్యక్తిగతంగానే కాకుండా దేశ ప్రజలందరి తరపునా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. మార్స్ ఆర్బిటర్ మిషన్ను విజయవంతం చేసి చారిత్ర సృష్టించారు'అని అన్నారు.
బ్రహ్మోస్ సృష్టికర్త పిళ్లై పరిశోధనలు ‘అగ్ని', ‘పృధ్వీ', ‘నాగ్', ‘ఆకాష్' మిస్సైళ్ల రూపకల్పనకు దోహదపడ్డాయని ఆయన గుర్తుచేశారు. కాగా రక్షణ, అంతరిక్ష పరిశోధన రంగంలో పిళ్లై చేసిన కృషికి గుర్తించిన కేంద్రం 2002లో పద్మశ్రీ పురస్కారం అందజేసింది. 2013లో పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది.
పిళ్లై రీసెర్చి అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డి), డిఫెన్స్ రీసెర్చి అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్డిఓ) చీఫ్ కంట్రోలరర్గా, బ్రహ్మోస్ ఎయిరో స్పేస్కు చీఫ్ ఎగ్జిక్యూటీవ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్గా సేవలందించారు. దేశానికి ఆయన అందించిన సేవలకు గుర్తుగా పిళ్లైను బ్రహ్మోస్ పితామహుడు అంటారు.
మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన పిళ్లై హార్వార్డ్ బిజినెస్ స్కూల్లో మేనేజ్మెంట్ ప్రొగ్రామ్ చేశారు. పూణె విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి తీసుకున్నారు. ప్రఖ్యాత శాస్తవ్రేత్తలైన డాక్టర్ విక్రమ్ సారాబాయ్, ప్రొఫెసర్ సతీష్ ధావన్, డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాంతో కలిసి ఆయన పనిచేశారు.

'బ్రహ్మోస్' శివథాను పిళ్లైకి లాల్బహదూర్ శాస్త్రి అవార్డు
ప్రముఖ రక్షణ పరిశోధకుడు, బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణి పితామహుడు శివధాను పిళ్లై లాల్ బహుదూర్ శాస్త్రి జాతీయ అవార్డు అందుకున్నారు.

'బ్రహ్మోస్' శివథాను పిళ్లైకి లాల్బహదూర్ శాస్త్రి అవార్డు
మంగళవారం రాష్టప్రతి భవన్లో జరిగిన ఓ కార్యక్రమంలో పిళ్లైకు రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ అవార్డును అందజేశారు. అంతరిక్ష పరిశోధనలు, మిస్సైల్ టెక్నాలజీ అభివృద్ధిలో పిళ్లై చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.

'బ్రహ్మోస్' శివథాను పిళ్లైకి లాల్బహదూర్ శాస్త్రి అవార్డు
ఈ అవార్డు కింద రూ. 5 లక్షలు, ప్రశంసాపత్రం, జ్ఞాపిక లభించాయి. ఈ సందర్బంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ ‘నేను వ్యక్తిగతంగానే కాకుండా దేశ ప్రజలందరి తరపునా మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. మార్స్ ఆర్బిటర్ మిషన్ను విజయవంతం చేసి చారిత్ర సృష్టించారు'అని అన్నారు.

'బ్రహ్మోస్' శివథాను పిళ్లైకి లాల్బహదూర్ శాస్త్రి అవార్డు
బ్రహ్మోస్ సృష్టికర్త పిళ్లై పరిశోధనలు ‘అగ్ని', ‘పృధ్వీ', ‘నాగ్', ‘ఆకాష్' మిస్సైళ్ల రూపకల్పనకు దోహదపడ్డాయని ఆయన గుర్తుచేశారు.

'బ్రహ్మోస్' శివథాను పిళ్లైకి లాల్బహదూర్ శాస్త్రి అవార్డు
కాగా రక్షణ, అంతరిక్ష పరిశోధన రంగంలో పిళ్లై చేసిన కృషికి గుర్తించిన కేంద్రం 2002లో పద్మశ్రీ పురస్కారం అందజేసింది. 2013లో పద్మవిభూషణ్ ఇచ్చి గౌరవించింది.

'బ్రహ్మోస్' శివథాను పిళ్లైకి లాల్బహదూర్ శాస్త్రి అవార్డు
మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన పిళ్లై హార్వార్డ్ బిజినెస్ స్కూల్లో మేనేజ్మెంట్ ప్రొగ్రామ్ చేశారు. పూణె విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్డి తీసుకున్నారు.

'బ్రహ్మోస్' శివథాను పిళ్లైకి లాల్బహదూర్ శాస్త్రి అవార్డు
సుప్రసిద్ధ శాస్తవ్రేత్తలైన డాక్టర్ విక్రమ్ సారాబాయ్, ప్రొఫెసర్ సతీష్ ధావన్, డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాంతో కలిసి ఆయన పనిచేశారు.












Click it and Unblock the Notifications