అఖిలేష్తో అంతా రౌడీలే: అమర్ సింగ్ సంచలనం
కుటుంబ రాజకీయాలు పక్కన పెట్టి నాయకత్వం పైన సమాజ్ వాది పార్టీ దృష్టి సారిస్తే బాగుంటుందని ఆ పార్టీ బహిష్కృత నేత అమర్ సింగ్ అన్నారు. నాయకత్వాన్ని ఎంచుకునే విషయంలో కుటుంబం వెలుపల నుంచి ఆలోచించాల్సిన అవసర
లక్నో: కుటుంబ రాజకీయాలు పక్కన పెట్టి నాయకత్వం పైన సమాజ్ వాది పార్టీ దృష్టి సారిస్తే బాగుంటుందని ఆ పార్టీ బహిష్కృత నేత అమర్ సింగ్ అన్నారు. నాయకత్వాన్ని ఎంచుకునే విషయంలో కుటుంబం వెలుపల నుంచి ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు.
సమాజ్ వాది పార్టీకి ములాయం సింగ్ యాదవ్ ఆత్మ అని చెబితే అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ దానిని విస్మరించిందన్నారు. యూపీలో బీజేపీ చేతిలో ఎస్పీ కాంగ్రెస్ కూటమి చావు దెబ్బతిన్న నేపథ్యంలో అమర్ సింగ్ స్పందించారు.

బీజేపీలో గానీ, వామపక్ష పార్టీలో గానీ వారసత్వ రాజకీయాలకు అవకాశముండదని, వాజపేయి, అద్వానీ లాంటి నేతలు అలాగే వచ్చారని గుర్తు చేశారు. ఎస్పీ బతకాలంటే నాయకత్వాన్ని వెలుపలి నుంచి వెతికి చూడాల్సి ఉందన్నారు.
ఎస్పీ ఓటమికి పార్టీ నేతలు చాలామంది ఈ పార్టీని వదిలి బీఎస్పీలో చేరడం అన్నారు. ఎస్పీ ప్రధాన ఆత్మ ములాయం అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని గుర్తించడంలో ప్రజల్లోకి ఆయన సెంటిమెంటును తీసుకెళ్లడంలో విఫలమైందన్నారు. అఖిలేష్తో ఉన్న వాళ్లు రౌడీలు, దందాలు చేసేవాళ్లని, పార్టీ భవిష్యత్తు ఏమవుతందో చూద్దామన్నారు.












Click it and Unblock the Notifications