బీమాండి టవర్స్లో భారీ అగ్ని ప్రమాదం: ఆ అపార్ట్మెంట్లోనే నటి దీపిక
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో బీమాండీ టవర్స్లో బుధవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. 45అంతస్తులు గల ఈ భవనంలో 33వ అంతస్తులో మంటలు చెలరేగాయి.
ప్రమాదంలో భవనంలోని పై రెండు అంతస్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ భవనంలోనే కేంద్రమంత్రి పీయూష్ గోయల్, బాలీవుడ్ నటి దీపికా పదుకొనె సహా పలువురు సెలబ్రిటీలు, ప్రముఖుల నివాసాలు కూడా ఉన్నాయి. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదన్న అధికారులు మంటలను నియంత్రించేందుకు శతవిధాలా ప్రయత్నించారు.

ఘటనా స్థలికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశాయి. తొలుత లెవల్ 2గా ఉన్న ప్రమాదం.. ఆ తర్వాత లెవల్ 3గా మారింది. 10 ఫైరింజన్లు, ఐదు జంబో ట్యాంకర్లు, 2 హైడ్రాలిక్ ప్లాట్ఫాంలు సహాయకచర్యల్లో పాల్గొన్నాయి.
సహాయక సిబ్బంది 95మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. కాగా, ఈ భవనంలోని 33వ అంతస్తులో 4బెడ్ రూం ఫ్లాట్ను రూ. 16కోట్లతో కొనుగోలు చేశారు దీపిక. తండ్రి ప్రకాశ్ పదుకొనెతోపాటు దీపిక ఇక్కడే ఉంటున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications