లండన్లో ప్రధాని నరేంద్ర మోడీపై మర్డర్ కేసు
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోడీని అరెస్ట్ చేయాలంటూ ఇంగ్లాండ్లో కేసు నమోదైంది. తారిఖ్ మహ్మద్ అనే ముస్లిం సామాజికవేత్త ఇంగ్లండ్లోని డెఫ్రాడ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
2002లో గుజరాత్లో అల్లర్లు జరిగిన సమయంలో ముగ్గరు బ్రిటీష్ పౌరులు మరణించడానికి అప్పటి ముఖ్యమంత్రి, ప్రస్తుత భారత ప్రధాని నరేంద్ర మోడీయే కారణమని ఆరోపిస్తూ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఈ ఘటనపై భారత ప్రధాని మోడీని పూర్తి బాధ్యుణ్ణి చేస్తూ వెంటనే అరెస్ట్ చేయాలంటూ కేసు పెట్టాడు. నవంబర్లో యుకె పర్యటనకు వస్తున్న ప్రధాని మోడీని అరెస్ట్ చేయాలని మహ్మద్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఫిబ్రవరి 27, 2002. గుజరాత్లోని గోద్రాలో సబర్మతి ఎక్స్వూపెస్ ఎస్-6లో చెలరేగిన మంటల్లో 59 మంది సజీవ దహనమయ్యారు. వీరిలో అధికులు అయోధ్య నుంచి వస్తున్న కరసేవకులు. ఈ ఘటన అనంతరం గుజరాత్లో పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగాయి.
గుజరాత్లో 25 జిల్లాలు ఉండగా.. 16 జిల్లాలు అల్లర్లతో అతలాకుతలమయ్యాయి. దాడులు, ప్రతిదాడులు, మారణాయుధాలతో వీధుల్లో స్వైరవిహారాలు, దహనాలు, లూఠీలు, హత్యలు, మానభంగాలు, సజీవ దహనాలతో 150 పట్టణాలు, వేలాది గ్రామాలు అల్లకల్లోలమయ్యాయి.
ఈ అల్లర్లలో మొత్తం 1200కు పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. వేల కోట్ల రూపాయల ఆస్తి బుగ్గిపాలైంది.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications