వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చెప్పులు మోసినా సీఎంకు నో టికెట్ -అదీ కాంగ్రెస్ దుస్థితి -పుదుచ్చేరి సభలో మోదీ -5రాష్ట్రాల్లో ఎన్డీఏ హవా

|
Google Oneindia TeluguNews

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం దక్షిణాదిలో సుడిగాలి పర్యటన చేశారు. మూడు ఎన్నికల రాష్ట్రాల్లో వరుసగా భారీ సభల్లో పాల్గొన్నారు. తొలుత కేరళలోని పాలక్కాడులో, ఆపై తమిళనాడులోని ధారాపురంలో, చివరిగా పుదుచ్చేరిలో బీజేపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తొలి రెండు సభల మాదిరే పుదుచ్చేరిలోనూ ప్రత్యర్థులపై మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

తిరుపతి పోరులో రత్నప్రభ తంటాలు -ఎన్టీఆర్ వారసుడు జగన్ -పగటి వేషగాళ్ల డ్రామా: మంత్రి కొడాలి నానితిరుపతి పోరులో రత్నప్రభ తంటాలు -ఎన్టీఆర్ వారసుడు జగన్ -పగటి వేషగాళ్ల డ్రామా: మంత్రి కొడాలి నాని

గడిచిన కొన్నేళ్లుగా కాంగ్రెస్ పాలనలో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరి పూర్తిగా ఆగమైపోయిందని, అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ సర్కారు విఫలమైందని, చివరికి సిట్టింగ్ ముఖ్యమంత్రి నారాయణస్వామికి టికెట్ నిరాకరించడం కాంగ్రెస్ ఘోర వైఫల్యానికి మచ్చుతునక అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సిటింగ్ సీఎంకు పోటీ చేసే అవకాశం ఇవ్వకపోవడంతో ఈ సారి ఎన్నికలు ప్రత్యేకమైనవిగా మారాయన్నారు.

Narayanasamy-led Cong govt in Puducherry was a disaster, nda wave in poll states, says pm Modi

పుదుచ్చేరి మాజీ సీఎం నారాయణస్వామి అనేక ఏళ్లుగా కాంగ్రెస్ అధిష్ఠానానికి విధేయంగా ఉంటూ వచ్చారని, కాంగ్రెస్ అధినేతల చెప్పులను కూడా నారాయణ స్వామి మోశారని, కీలక నేత(రాహుల్ గాంధీ)ని ఆకట్టుకునేందుకు తప్పుడు అనువాదాలు కూడా చేశారని, పాపం ఇన్ని చేసినప్పటికీ నారాయణస్వామికి కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టిక్కెట్ ఇవ్వకపోవడం శోచనీయమని మోదీ ఎద్దేవా చేశారు. నారాయణస్వామిని పోటీ నుంచి పక్కకు తప్పించడాన్ని బట్టి పుదుచ్చేరిలో కాంగ్రెస్ ప్రభుత్వం విధ్వంసం సృష్టించిందని స్పష్టంగా అర్థమవుతోందన్నారు.

Narayanasamy-led Cong govt in Puducherry was a disaster, nda wave in poll states, says pm Modi

పుదుచ్చేరి సహా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతోన్న తమిళనాడు, కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఎన్డీఏ హవా కనిపిస్తున్నదని, తాను పాల్గొన్న సభలన్నింటినీ ప్రజలు విజయవంతం చేశారని, అన్ని చోట్లా ఎన్డీఏ కూటములే విజయం సాధిస్తాయన్న నమ్మకం ఏర్పడిందని ప్రధాని మోదీ చెప్పారు. మొత్తం 30 స్థానాలున్న పుదుచ్చేరి అసెంబ్లీకి ఏప్రిల్ 6న ఎన్నికలు జరుగుతాయి.

ఆకు రౌడీలు.. లాఠీలతో భయపెట్టలేరు -ఏసుక్రీస్తుకు యూదా, కేరళకు విజయన్ ద్రోహం -ప్రధాని మోదీ సంచలనంఆకు రౌడీలు.. లాఠీలతో భయపెట్టలేరు -ఏసుక్రీస్తుకు యూదా, కేరళకు విజయన్ ద్రోహం -ప్రధాని మోదీ సంచలనం

English summary
argeting senior Congress leader V Narayanasamy, Prime Minister Narendra Modi on Tuesday said the previous party government headed by him was a ''disaster'' that failed on all fronts and underlined the NDA''s commitment to ensure its growth. Addressing an election rally of the NDA, attended by AINRC founder and former chief minister N Rangasamy, AIADMK and BJP leaders, Modi said he saw a "huge wave" in support of the National Democratic Alliance in the poll-bound states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X