కౌంటర్: మోడీ 'నమో చాయ్'కి రాహుల్ గాంధీ 'పాలు'
ఈ నేపథ్యంలో కాంగ్రెసు పార్టీ నేతలు కొందరు కౌంటర్గా పాలు ఇస్తున్నారు. ఏఐసిసి రాహుల్ గాంధీ మిల్క్ పేరిట ఉచితంగా పాలు అందిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ మిల్క్ (రా.గా.పాలు) పేరిట రోడ్డుపై వెళ్ళేవారికి ఉచితంగా పేపర్ కప్పుల్లో పాలు అందించారు.
నగరంలోని ప్రతి బ్లాక్లో రోజుకు యాభై లీటర్ల పాలను ఉచితంగా సరఫరా చేయాలని నిర్ణయించుకున్నామని గోరఖ్ పూర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సయ్యద్ జమాల్ తెలిపారు.
దీని ద్వారా తాము సందేశాన్ని ఇస్తున్నామని చెప్పారు. టీ తాగటం ఆరోగ్యానికి మంచిది కాదని, మోడీ పాలన దేశానికి అరోగ్యకరం కాదని, పాలే సర్వశ్రేష్టమని తాను చెప్పదల్చుకున్నామన్నారు.
మొదట ఐదు స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత మరో పందోమ్మిది స్టాళ్లు ఏర్పాటు చేశారు. మొత్తం ఇరవై నాలుగు స్టాళ్లలో రోజుకు నాలుగు వందల మందికి యాభై లీటర్ల పాలను ఇస్తున్నట్లు చెప్పారు.