జాతీయ స్థాయి జూడో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్
న్యూఢిల్లీ: జాతీయ స్థాయి జూడో క్రీడాకారిని సామూహిక అత్యాచారానికి గురైంది. ఈ దుస్సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుర్గావ్ లోని బిలాస్ పూర్ లో జాతీయ స్థాయి జూడో క్రీడాకారిని గత నెలలో అత్యాచారానికి గురైంది.
ఈ సంఘటనపై సోమవారం స్థానిక మహిళా పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. క్రీడాకారిని పై ఇద్దరు గుర్తు తెలియని దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబధించి ఒక నిందితుడిని అరెస్టు చేశామని, మరో నిందుతుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నామని వారు తెలిపారు.
ఇదిలావుంటే, గుర్గావ్ లో మరొక సంఘటనలో, డీఎల్ఎఫ్2 పోలీస్ స్టేషన్ లో అత్యాచార కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం - ఇద్దరు నేపాలీ అమ్మాయిలను సౌదీ జాతీయులు ఇద్దరు బలవంతంగా బంధించి అత్యాచారం చేశారని కేసు నమోదైంది.
ఈ కేసుకు సంబంధించి విచారణ కొనసాగుతుందని.. ఇంకెవ్వరిని అరెస్టు చేయలేదని పోలీస్ అధికారుల తెలిపారు.