ఓఎన్జీసీలో భారీ అగ్ని ప్రమాదం: ఐదుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు
ముంబై: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ఓఎన్జీసీ గ్యాస్ ప్రాసెసింగ్ ప్లాంట్లో మంగళవారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రగాయాలపాలయ్యారు.
నేవీ ముంబైలోని ఉరాన్ ప్రాంతంలో ఉన్న ఓఎన్జీసీ ప్లాంటులో మంగళవారం ఉదయం 6.45గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రమాదం చోటు చేసుకున్న కాసేపటికే మంటలు భారీగా ఎగిసిపడి ఇతర ప్రాంతాలకు వ్యాపించాయి. కార్మికులు పనిచేస్తున్న సమయంలోనే ప్రమాదం చోటు చేసుకోవడంతో కొందరు కార్మికులు తప్పించుకోలేకపోయారు.

ఐదుగురు కార్మికులు ఈ ప్రమాదంలో మృతి చెందగా, మరో ముగ్గురు కార్మికులు తీవ్రగాయాలపాలయ్యారు. మృతుల్లో ముగ్గురు సీఐఎస్ఎఫ్ ఫైర్మెన్ ఉన్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. ఉరాన్, పన్వేలు, నెరూల్, జేఎన్పీటీ ప్రాంతాల నుంచి ఫైరింజిన్లు వచ్చి మంటలను ఆర్పివేశాయి.
అయితే, ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ప్రమాద ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యగా ఉరాన్ నుంచి గ్యాస్ను గుజరాత్లోని హజీరా ఓఎన్జీసీ ప్లాంటుకు తరలిస్తున్నారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications