Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కేంద్రానికి సిద్ధూ వార్నింగ్- ఛలో లఖీంపూర్ హెచ్చరిక- ఆశిష్ అరెస్ట్, ప్రియాంక విడుదల కాకపోతే

ఉత్తర్ ప్రదేశ్ లోని లఖీంపూర్ ఖేరీ లో రైతులపై కారు పోనిచ్చి ఎనిమిది మృతికి కారకుడైన కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను అరెస్టు చేయాలని పోలీసులపై ఒత్తిడి పెరుగుతోంది. ఆశిష్ ను అరెస్టు చేయకుండా లఖీంపూర్ వెళ్లేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీని అరెస్టు చేసి నిర్బంధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఈ వివాదంపై పంజాబ్ పీసీసీ మాజీ ఛీఫ్ నవ్ జ్యోత్ సింగ్ సిద్దూ తీవ్రంగా స్పందించారు.

లఖీంపూర్ ఖేరీ ఘటన, అనంతర పరిణామాలపై స్పందించిన సిద్ధూ... కేంద్రానికి స్టాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. లఖీంపూర్ ఘటనకు బాధ్యుడైన ఆశిష్ మిశ్రాను అరెస్టు చేయడంతో పాటు ప్రియాంకగాంధీని విడుదల చేయకపోతే అక్కడికి ర్యాలీగా రావాల్సి ఉంటుందని కేంద్రాన్ని సిద్ధూ హెచ్చరించారు. రేపటి కల్లా ఈ రెండు అంశాలపై నిర్ణయం తీసుకోకపోతే పంజాబ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూపీకి రావాల్సి ఉంటుందని సిద్ధూ వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.

navjoth singh sidhu warns centre to march lakhimpur kheri if union minisers son not arrested

ప్రస్తుతం పంజాబ్ కాంగ్రెస్ వివాదాలతో బిజీగా ఉన్న సిద్ధూ... యూపీలో జరుగుతున్న పరిణామాలపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ముఖ్యంగా లఖీంపూర్ లో సిక్కు రైతులపై జరిగిన దాష్టికం నేపథ్యంలో సిద్దూ వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. లఖీంపూర్ కు సిద్ధూ, కాంగ్రెస్ నేతలతో బయలుదేరితే తలెత్తే పరిణామాలపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. లఖీంపూర్ కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఎస్పీ అధినేత అఖిలేష్, ప్రియాంక, ఛత్తీస్ ఘడ్ సీఎం భూపేష్ భగేల్ సహా పలువురిని యూపీ పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నా లెక్క చేయడం లేదు. దీంతో లఖీంపూర్ కు ర్యాలీగా వస్తామని సిద్ధూ చేసిన హెచ్చరికలు చర్చనీయాంశమవుతున్నాయి.

మరోవైపు లఖీంపూర్ ఘటనకు తాము బాధ్యులం కాదని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రాతో పాటు ఆయన కుమారుడు ఆశిష్ కూడా చెప్తున్నారు. ఆశిష్ ను ఇప్పటివరకూ అరెస్టు చేయకపోవడంపై రైతులతో పాటు విపక్ష పార్టీలు సైతం కన్నెర్ర చేస్తున్నాయి. దీంతో కేంద్రంతో పాటు .యూపీలోని ఆదిత్యనాథ్ సర్కార్ కూడా ఇరుకునపడుతున్నాయి. లఖీంపూర్ ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ఇప్పటికే సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు కేంద్రంపై మరింత ఒత్తిడి పెంచుతున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+