ఫాస్టాగ్ లో తాజా సవరణలు: ఇకపై వాటికి డబుల్
ప్రతి వాహనానికీ అత్యవసరమైన ఫాస్టాగ్ లో.. భారీగా సవరణలు చోటు చేసుకున్నాయి. యాన్యువల్ పాస్ మొదలుకుని ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) వరకు పలు మార్పులు సంభవించాయి. అవన్నీ కూడా వాహనదారులకు అనుకూలంగా ఉన్నవే.. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ ను నివారించడానికి ఉద్దేశించినవే. క్రమంగా టోల్ గేట్లల్లో కూడా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం పూర్తి స్థాయిలో అమలులోకి రాబోతోంది కూడా.
ఈ పరిణామాల మధ్య కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఫాస్టాగ్ లో తాజా సవరణలు చేసింది. జాతీయ రహదారులపై ఓవర్ లోడ్తో వెళ్లే వాహనాలు ఇకపై అధక టోల్ ట్యాక్స్ ను చెల్లించాల్సి ఉంటుంది. దీనికోసం 'నేషనల్ హైవేస్ ఫీ ఫోర్త్ అమెండ్మెంట్ రూల్స్ పేరుతో ప్రకటించిన ఈ మార్పులు నేటి నుండి అమలులోకి వచ్చాయి. అందుబాటులో ఉన్న డిజిటల్ వ్యవస్థలు.. ముఖ్యంగా ఫాస్టాగ్ ద్వారా చెల్లింపులను బలోపేతం చేయడం, హైవేలపై సురక్షిత ప్రయాణాన్ని కల్పించడం దీని ఉద్దేశం.

సవరించిన రూల్ 10 ప్రకారం- అనుమతించిన వాహన బరువును మించి అధిక లోడ్తో వెళ్లే వాహనాలు నేటి నుంచి అసెస్మెంట్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఓవర్లోడ్ రవాణాకు సంబంధించిన అసెస్మెంట్ ప్రక్రియ, అదనపు ట్యాక్స్, ఫాస్టాగ్ ద్వారా డిజిటల్ చెల్లింపుల్లో పూర్తిగా మార్పులు చేసింది కేంద్ర రోడ్డు రవాణా శాఖ. నిర్దేశించిన లోడ్ కంటే ఎంత మేర ఓవర్లోడ్ ఉందనే విషయాన్ని అసెస్మెంట్ చేసిన అనంతరం ఎంత అదనపు మొత్తాన్ని కట్టాల్సి ఉంటుందనేది నిర్ణయిస్తారు.
ఉదాహరణకు, 10 శాతం వరకు అదనపు లోడ్కు ఎటువంటి ఓవర్లోడ్ ఫీజు ఉండదు. 10 నుండి 40 శాతం వరకు ఓవర్ లోడ్ ఉంటే బేస్ రేటుకు రెండు రెట్లు ఎక్కువ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది.. వాహనదారుడికి. అదేవిధంగా బరువు 40 శాతం కంటే ఎక్కువ ఉంటే బేస్ రేటుకు నాలుగు రెట్లు అధికంగా చెల్లించాలి. ఓవర్లోడింగ్ను టోల్ ప్లాజాల వద్ద ఉన్న అమర్చిన పరికరాల ద్వారా అసెస్మెంట్ చేస్తారు. ఈ పరికరాలు లేని టోల్ ప్లాజాలు ఎటువంటి ఓవర్లోడ్ రుసుము వసూలు చేయవు.
అదనపు మొత్తాన్ని నగదు రూపంలో టోల్ ప్లాజా సిబ్బంది స్వీకరించారు. డిజిటల్ ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ వసూలు పూర్తిగా ఫాస్టాగ్ ద్వారా మాత్రమే జరుగుతుంది. ఫాస్టాగ్ లేని వాహనాలను ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం పక్కకు మళ్లిస్తారు. అదనపు బరువు ఉన్న వాహనాల వివరాలను నేషనల్ వెహికల్ రిజిస్టర్ (VAHAN)కు నివేదించడం కూడా తప్పనిసరి. కొత్త నిబంధనల అమలుకు ముందు ప్రారంభమైన కొన్ని ప్రైవేట్ పెట్టుబడి ప్రాజెక్టులకు ఇవి వర్తించవు.
-
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
Tamil Nadu Election: అంతుబట్టని విజయ్ తీరు..! తెరవెనుక ఏం జరుగుతోంది ? -
ఆర్టీసీ బస్సుల బంద్ - జేఏసీ కీలక పిలుపు..!!












Click it and Unblock the Notifications