కర్ణాటక సీఎం యడ్యూరప్పకు ఎదురుదెబ్బ: 15ఏళ్ల నాటి కేసు దర్యాప్తునకు కోర్టు ఆదేశం
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పకు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.15 ఏళ్ల నాటి భూకేటాయింపుకు( భూముల డీనోటిపికేషన్ కేసు) సంబంధించిన కేసులో ఆయనపై దర్యాప్తును ముగించాలని కోరుతూ లోకాయుక్త పోలీసులు దాఖలు చేసిన బీ-రిపోర్ట్ ను శనివారం బెంగలూరులోని ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది.
ఈ కేసులో లోకాయుక్త డిప్యూటీ సూపరింటెండెంట్ స్థాయి అధికారితో దర్యాప్తునకు కొనసాగించడం సహా తుది నివేదికను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. కేసు దర్యాప్తులో జాప్యంపై కర్ణాటక హైకోర్టు వ్యాఖ్యలను పరిగణలోకి తీసుకోవాలని అధికారులకు సూచించింది.

వర్తూర్-వైట్ఫీల్డ్ ఐటీ కారిడార్ పరిధిలోని బెల్లాండూర్, దేవం బీసనహళ్లిలోని విలువైన భూమి డీనోటిఫికేషన్కు సంబంధించి యడ్యూరప్ప అవతవకలకు పాల్పడ్డారంటూ వాసుదేవ రెడ్డి అనే వ్యక్తి లోకాయుక్త కోర్టులో ఫిర్యాదు చేశారు. అప్పుడు నాటి జేడీఎస్-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో యడ్యూరప్ప డిప్యూటీ సీఎంగా ఉన్నారు.
కాగా, కోర్టు ఆదేశాల మేరకు 2015, ఫిబ్రవరి 21న అవినీతి నిరోధక చట్టం కింది లోకాయుక్త పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో దర్యాప్తును ముగించాలని కోరుతూ 2020 డిసెంబర్ నెలలో యడ్యూరప్ప కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, పిటిషన్లను తిరస్కరించిన కోర్టు.. దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది.
-
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?












Click it and Unblock the Notifications