డీజిల్ కార్లు: మరో 11 సిటీల్లో బ్యాన్
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ నగరంలో కొనసాగుతున్న పెద్ద డీజిల్ వాహనాల అమ్మకం నిషేధం దేశంలోని మరో 11 నగరాల్లో అమలు చెయ్యాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ (ఎన్ జీటీ) సోమవారం నిర్ణయం తీసుకుంది. 11 నగరాల్లో గాలి కాలుష్య డేటా ఆధారంగా ఎన్ జీటీ ఈ నిషేధాన్ని అమలు చెయ్యనుంది.
బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్ కత్తా, పట్నా, అలహాబాద్, లక్నో, వారణాసి, పూణే, కాన్పూర్, నాగ్ పూర్, జలంధర్, లూథీయానా, అమృత్ సర్ వంటి నగరాల్లో అమలు చెయ్యాలని నిర్ణయించారు. 2015 డిసెంబర్ లో దేశ రాజధాని ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో ఈ నియమాలు అమలు చేశారు.

ఢిల్లీ నగరం, పరిసర ప్రాంతాల్లో పెద్ద డీజిల్ కార్ల సంచారాన్ని నిషేదిస్తూ సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి అక్కడ ఎక్కువ సామర్థ్యం ఉన్న డీజిల్ వాహనాల అమ్మకాలు జరగడం లేదు. కేరళలోని కొన్ని నగరాల్లో ఈ నిషేదం అమల్లోకి తీసుకువచ్చారు.
దీంతో ఆటో పరిశ్రమలో పెట్టుబడులు కోల్పోయారు. దాదాపు 11 వేల వాహనాల ఉత్పత్తి ఆగిపోయింది. ఆటో పరిశ్రమలో 5,500 మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ నిషేదం దేశమంతటా విధిస్తే 44 వేల ఉద్యోగాలకు నష్టం చేకూరుతుందని సియామ్ రిపోర్టు స్పష్టం చేసింది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications